Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తేజ్ కు లహరి దొరికింది

తేజ్ కు లహరి దొరికింది

సాయిధరమ్ తేజ్ చేస్తున్న లేటెస్ట్ సినిమా చిత్ర-లహరి. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఒకరు చిత్ర, మరొకరు లహరి. సో, టైటిల్ పుట్టింది. సినిమాలో చిత్రలహరి అనే బార్ కూడా వుంటుదని టాక్. ఈ సంగతి అలా వుంచితే, సినిమాలో చిత్ర క్యారెక్టర్ కు కళ్యాణి ప్రియదర్శిన్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. రెండో క్యారెక్టర్ లహరి కోసం కూడా ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసేసారు.

ఈ అమ్మాయి ఎవరో కాదు. మెంటల్ మదిలో, టిక్ టిక్ టిక్, రోషగాడు సినిమాల్లో నటించిన నివేథా పేతురాజ్. మధురై ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి, దుబాయ్ లో పెరిగింది. ఇటీవలే ఈ నివేధాకు ఫొటో షూట్ చేసి, ఓకె చేసారు. నివేథా పేతురాజ్ ఈ సినిమాలో కాస్త మోడరన్ టచ్ వున్న అమ్మాయిగా కనిపిస్తుందని తెలుస్తోంది.

చిత్రలహరి సినిమా మైత్రీమూవీస్ బ్యానర్ పై తయారవుతోంది. దీనికి కిషోర్ తిరుమల దర్శకుడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను మూడునెలల్లో ఫినిష్ చేసి, 2019 ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

చిలక.. 'ఛీ'బీఐ.. భళా మోడీ భళా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ లో 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?