ఈ ఏడాది ఒక్క సినిమాతోనే సరి!

గడిచిన రెండేళ్లుగా ఏడాదికి కనీసం 2 సినిమాలు చేస్తున్న రామ్ ఈ ఏడాది మాత్రం సింగిల్ మూవీతో సరిపెట్టుకుంటున్నాడు. అదే 'ఉన్నది ఒక్కటే జిందగీ'. కిషోర్ తిరమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. గతంలో…

గడిచిన రెండేళ్లుగా ఏడాదికి కనీసం 2 సినిమాలు చేస్తున్న రామ్ ఈ ఏడాది మాత్రం సింగిల్ మూవీతో సరిపెట్టుకుంటున్నాడు. అదే 'ఉన్నది ఒక్కటే జిందగీ'. కిషోర్ తిరమల దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో నేను శైలజ అనే హిట్ సినిమా వచ్చింది.

2015లో పండగ చేస్కో, శివం సినిమాలు చేశాడు రామ్. గతేడాది నేను శైలజ, హైపర్ సినిమాల్లో కనిపించాడు. ఈ ఏడాది మాత్రం ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాతోనే సరిపెట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో రాక్ స్టార్ గా సరికొత్తగా కనిపించబోతున్నాడు రామ్. ఆ క్యారెక్టర్ మేకోవర్ కోసం చాలా టైం తీసుకోవడం వల్లనే సినిమా లేట్ అయిందని అంటున్నాడు. 

నిజానికి హైపర్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వల్లనే రామ్ గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ లో చాలా కథలు విన్నాడు. కొంతమంది దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఫైనల్ గా తనకు హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల తోనే మరోసారి సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇంత లేట్. 

ప్రస్తుతం ఇటలీలో రామ్ కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ సరనస అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 27న 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాను విడుదల చేయాలనకుంటున్నారు.