పబ్లిసిటీ లో ‘జీరో’నే బెటర్

ఒక్కోసారి అంతే..పేరులు సూపర్ గా వుంటాయి కానీ, విషయం తక్కవగా వుంటుంది. ఈ నెల 27న విడుదలవుతున్నయి రెండు సినిమాలు. రవితేజ బెంగాల్ టైగర్..అనుష్క సైజ్ జీరో. కానీ ఇంతవరకు బెంగాల్ టైగర్ పబ్లిసిటీ…

ఒక్కోసారి అంతే..పేరులు సూపర్ గా వుంటాయి కానీ, విషయం తక్కవగా వుంటుంది. ఈ నెల 27న విడుదలవుతున్నయి రెండు సినిమాలు. రవితేజ బెంగాల్ టైగర్..అనుష్క సైజ్ జీరో. కానీ ఇంతవరకు బెంగాల్ టైగర్ పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు. సైజ్ జీరో ప్రచారం కుమ్మేస్తున్నారు. కొత్త కొత్త అయిడియాలుచేసి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు. వాళ్ల దీన్నో ప్రెస్జీజియస్ ప్రాజెక్టుగా ఫీల్ అవుతున్నారు. 

కానీ బెంగాల్ టైగర్ నిర్మాత డేట్ మీదే ఇంకా కిందామీదా పడుతున్నారట. నిజానికి రవితేజ సినిమా ఒప్పుకునే ముందే నిర్మాతను పదేపదే పబ్లిసిటీ బాగా చేస్తారా అని అడిగినట్లు వినికిడి. దానికి నిర్మాత ఓకే అన్నారని, కానీ ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

నిర్మాతకు చెప్పలేక, సినిమాకు ప్రచారం లేక డైరక్టర్ సంపత్ నంది సైలంట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. సైజ్ జీరో సినిమా క్లాస్ అని, తమ సినిమా మాస్ కాబట్టి, ప్రచారం ఎలా వున్నా ఓపెనింగ్స్ కుమ్మేస్తాయని నిర్మాత ధీమాపడుతున్నారని వినికిడి. కానీ విడుదల రోజు ప్రచారం చేయాలి, ప్రకటనలు ఇవ్వాలి అనుకంటే, అన్ని స్లాట్ లు సైజ్ జీరో జనాలు ముందే బుక్ చేసేసారట. దీంతో టైగర్ కు ప్లేస్ లేకుండా అయిపోయిందని తెలుస్తోంది. మరి ఏ సినిమా గెలిచి, నిలుస్తుందో చూడాలి.