తొలిసారి బాలయ్య ఆ పని చేస్తున్నారు

పైసా వసూల్ సినిమా స్టంపర్ కు అభిమానుల్లోంచి వచ్చిన స్పందన హీరో బాలకృష్ణను ఫుల్ ఖుషీ చేసింది. పైసా వసూల్ సినిమా విజయవంతం కావడానికి తన వంతు ప్రయత్నం కూడా చేయాలని డిసైడ్ అయ్యాడు.…

పైసా వసూల్ సినిమా స్టంపర్ కు అభిమానుల్లోంచి వచ్చిన స్పందన హీరో బాలకృష్ణను ఫుల్ ఖుషీ చేసింది. పైసా వసూల్ సినిమా విజయవంతం కావడానికి తన వంతు ప్రయత్నం కూడా చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకే తొలిసారి బాలకృష్ణ ఓ పని చేయాలని డిసైడ్ అయ్యాడు. అదేంటో కాదు, ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం. 

సినిమాల విడుదల ముందు ఫ్యాన్స్ ను కలవడం అన్నది మెగా హీరోలకు ఆనవాయతీ. జనతా గ్యారేజ్ విడుదలకు ముందు  ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ ను విడతల వారీ కలిసాడు. కానీ తన వందో సినిమా అయినా కూడా బాలయ్య ప్రత్యేకించి, ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేయలేదు. 

అయితే ఇటీవల కొంత కాలంగా ఫ్యాన్స్ బాలయ్యను ఈ మీట్ విషయమై అడుగుతున్నారు. కీలకమైన ఫ్యాన్స్ కాకుండా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకకు చెందిన వారందరినీ ఒకేసారి బాలయ్య కలవాలనుకుంటున్నారు. అందుకే ఫ్యాన్ మీట్ ను ఏర్పాటు చేస్తున్నారట. బాలయ్య ఫ్యాన్స్ కు మిగిలిన ఫ్యాన్స్ కు చాలా తేడా వుంది. బాలయ్యను ఆయన ప్లస్ లు మైనస్ లతో్ సహా అభిమానించేవారు ఆయన ఫ్యాన్స్. అలాంటి ఫ్యాన్స్ అంతమంది ఓ దగ్గర చేరితే రచ్చ రచ్చే.