Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టోటల్ మెగాహీరోస్ ఇన్ వన్ ఫ్రేమ్

టోటల్ మెగాహీరోస్ ఇన్ వన్ ఫ్రేమ్

ఖైదీ ఫ్రీ సక్సెస్ మీట్ కు మెగా హీరోలు అందరూ హాజరు కావడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వరుణ్ తేజ, సాయి ధరమ్ తేజ తమ తమ మిస్టర్, విన్నర్ షూటింగ్ లకు సెలవు పెట్టేసారు. అల్లు అర్జున్ కూడా హాజరవుతున్నట్లు బోగట్టా. ఇక మిగిలింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన కూడా హాజరవుతారనే వినిపిస్తోంది. 

ముందుగా ప్రకటిస్తే, సమస్యలు వస్తాయని, అందుకే చెప్పడం లేదని ఒక గ్యాసిప్ వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇంత గొప్ప ఈవెంట్ మరొకటి ఇప్పట్లో వుండదని, అందువల్ల దీనికి పవన్ హాజరు కావడం పక్కా అని అంటున్నారు. కాదు, పవన్ తప్ప మిగిలిన వారంతా హాజరవుతారని అంటున్నారు. 

పవన్ రాక గురించి చెప్పకుండానే ఫంక్షన్ తో సంబంధం వున్న వర్గాలు, మెగా హీరోలు అందరూ ఒక ఫ్రేమ్ లోకి వస్తారని మాత్రం అంటున్నాయి. దర్శకుడు దాసరి నారాయణ రావును చీఫ్ గెస్ట్ గా పిలవాలన్న అయిడియా పవన్ దే అని, పవన్ ఎంట్రీ లాస్ట్ మినిట్ లో వెల్లడిస్తారని అంత వరకు గ్యాసిప్ ల్లోనే వుంటుందని తెలుస్తోంది. 

పవన్ రాకపోతే పవర్ స్టార్ నినాదాలతో సమావేశం రసాభాస అవుతుందని, అందువల్ల పవన్ వస్తేనే బెటర్ అని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?