Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

యువి సొమ్ము సెట్ ల పాలు!

యువి సొమ్ము సెట్ ల పాలు!

ఏ ముహూర్తాన మొదలు పెట్టారో జాన్ సినిమా. టైటిలే మారిపోయి రాధేశ్యామ్ అయింది. అది వేరే సంగతి. విదేశాల్లో వింటేజ్ సెట్ ల మీద సెట్ లు వేసి షూట్ చేసారు.దానికే కోట్లు ఖర్చయిపోయింది. అది చాలదన్నట్లు మళ్లీ అన్నపూర్ణలో సెట్ వేసారు. దాంట్లో ప్రభాస్ ఫొటో దిగి బయటకు వదిలారు. ఇప్పుడు అదీ చాలదన్నట్లు మళ్లీ ఇంకా సెట్ ల మీద సెట్ లు వేస్తున్నారట.

సెట్ లు వేయడానికి కోట్లు, ఫ్లోర్ అద్దెలు ఇలా అంతా తడిసి మోపెడవుతున్నట్లు బోగట్టా. ప్రభాస్ లాంటి హీరోతో చకచకా సినిమా తీసుకుంటే కాస్త డబ్బులు మిగుల్తాయి అనుకుంటే ఈ సెట్ లు అన్నీ కలిసి బడ్జెట్ ను అమాంతం పెంచేస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సాహో సినిమా తరువాత ఉత్పన్నమైన పరిస్థితుల కారణంగా రాథేశ్వామ్ బడ్జెట్ ను వీలయినంత కంట్రోల్ చేయాలనుకున్నా, ఈ సెట్ ల కారణంగా అది సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. పైగా సెట్ వేయడానికి, షూటింగ్ కు, ఇతరత్రా వ్యవహారాలు అన్నింటికి కలిపి ఫ్లోర్ అద్దెలు కూడా భారీగానే వున్నట్లు టాక్. పైగా ఈ సినిమా కూడా ఇప్పట్లో విడుదల కాదంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ లో వున్నారు. అది గమనించి అయినా చకచకా రెడీ చేస్తే బాగుంటుందేమో?

ఈ వేసవి లో పెళ్లి చేసుకోబోతున్న దిల్ రాజు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?