Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అంకుల్ నాగ్ తో బహు సమంత

అంకుల్ నాగ్ తో బహు సమంత

అక్కినేని వారింటి కోడలు అని డిక్లేర్ అయిన తరువాత సరైన సినిమా సెట్ కాలేదు హీరోయిన్ సమంతకు. కానీ ఇప్పుడు ఓ సూపర్ ప్రాజెక్ట్ లో పార్ట్ కాబోతోంది. రాజుగారి గది 2 సినిమాలో సమంత నటించబోతోంది. పివిపి సంస్థ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నఈ సినిమాలో సమంత తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా వుంటారు.

రన్ రాజా రన్ సీరత్ కపూర్ మరో హీరోయిన్ గా ఎంపికయింది. మూడో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగాల్సి వుంది. ఈ సినిమాలో నాగ్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. ముగ్గురు కుర్రాళ్ల క్యారెక్టర్లను వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్ పోషిస్తున్నారు. అయితే ముగ్గురు హీరోయిన్లు ఎవరి కోసం? నాగ్ పక్కనా? మరేంటీ కథ అన్నది అంతా ఇంకా తెలియాల్సి వుంది.

నాగ్ పక్కన సమంత వేయడం ఏంటీ సెంటిమెంట్ గా వుండొచ్చు. అందువల్ల వేరే డిఫరెంట్ క్యారెక్టర్ నే సమంతది కూడా అని అనుకోవాలి. ఏదైనా సమంత కూడా రాజుగారి గదిలోకి రావడం అన్నది ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ తీసుకువచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?