Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఉపాసన బేరం చేస్తున్న జీవిత ప్రాపర్టీ?

ఉపాసన బేరం చేస్తున్న జీవిత ప్రాపర్టీ?

వ్యాపార వర్గాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు అన్నవి మామూలే. అమ్మేవాళ్లు అమ్ముతుంటారు. కొనేవాళ్లు కొంటూ వుంటారు. హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవితకు ఫిలిం నగర్ సమీపంలో ఓ ఖరీదైన ప్రాపర్టీ వుంది. దాన్ని డెవలప్ మెంట్ ఇచ్చారు. వీళ్ల వంతుకు అద్దెలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు దాన్ని అమ్మకానికి పెట్టారనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

చదరపు అడుగు 15 వేల వంతున విక్రయానికి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిని కొనడానికి హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ఆసక్తి కనబరిచారని, బేరాలు సాగుతున్నాయని తెలుస్తోంది. 

అయితే ఈ బిల్డింగ్ డెవలపర్ గా వున్న ఫీనిక్స్ సంస్థ తన చేతిలో వున్న వాటాను కూడా విక్రయించాలని అనుకుంటోందని బోగట్టా. ఈ బిల్డింగ్ లో జీవిత రాజశేఖర్ వాటా విలువే దగ్గర దగ్గర 200 కోట్ల వరకు వుంటుందని బోగట్టా.

కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఇప్పటికే ఈ భవనంలో అద్దెకు వున్నవారు. వీళ్లు ఖాళీ చేస్తే తప్ప అమ్మకం కుదరదు. అయితే డెవలపర్ అయిన ఫీనిక్స్ సంస్థ దాని పక్కనే మరో భారీ భవంతిని డెవలప్ చేసింది. 

అందులోనే హారిక హాసిని చినబాబు, ఎన్టీఆర్ లాంటి పెద్దలు ప్రాపర్టీలు కొనుగోలు చేసారని అంటారు. ఆ భవంతిలో వున్న ఖాళీల్లోకి ఈ బిల్డింగ్ లో వున్నవారిని షిప్ట్ చేసి, అప్పుడు విక్రయం పూర్తి చేయాలనే డిస్కషన్లు సాగుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ విక్రయం తరువాత ఫీనిక్స్ నే విప్రో సర్కిల్ ప్రాంతంలో డెవలప్ చేసిన కమర్షియల్ ప్లేస్ ను జీవిత రాజశేఖర్ కొనుగోలు చేసే ఆలోచనలో వున్నారని కూడా తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?