రవితేజ కోసం అమెరికా వెళ్లాడు

ప్రస్తుతం టచ్ చేసి చూడు అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ మూవీ తర్వాత ఏ సినిమా చేస్తాడనే విషయంపై ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. లిస్ట్ లో మాత్రం కల్యాణ్ కృష్ణ,…

ప్రస్తుతం టచ్ చేసి చూడు అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ మూవీ తర్వాత ఏ సినిమా చేస్తాడనే విషయంపై ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. లిస్ట్ లో మాత్రం కల్యాణ్ కృష్ణ, శ్రీనువైట్ల పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. బోగన్ రీమేక్ దాదాపు లేనట్టే అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ ఇద్దరు దర్శకుల్లో శ్రీనువైట్ల ఇప్పుడు ఏకంగా లొకేషన్ల వేటలో పడడంతో.. ఈ సినిమానే ముందు సెట్స్ పైకి రావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. 

అవును… రవితేజ సినిమా కోసం శ్రీనువైట్ల లొకేషన్ల వేటలో పడ్డాడు. ఏకంగా అమెరికాలో అందమైన లొకేషన్లు వెదుకుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతోంది. యూఎస్ నుంచి శ్రీనువైట్ల వచ్చిన వెంటనే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. 

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశాడు వైట్ల. ఈ స్క్రిప్ట్ కు అటు రవితేజతో పాటు మైత్రీ నిర్మాతల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ మూవీతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు శ్రీనువైట్ల. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వైట్లకు ఎలాంటి రెమ్యూనరేషన్ అందడం లేదు. కేవలం సక్సెస్ పైనే అతడి పారితోషికం ఆధారపడి ఉంటుంది.