Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వంశీ పైడిపల్లి అలా.. నమ్రత డీలా?

వంశీ పైడిపల్లి అలా.. నమ్రత డీలా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే, సినిమాలో చాలా వ్యవహారాలపై ఆయన భార్య నమ్రత సూపర్ విజన్ వుంటుంది. ప్రతి విషయాన్నీ ఆమె జాగ్రత్తగా చూసుకుంటారు. ఫ్యాన్స్ నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటారు. కానీ మహర్షి సినిమా దగ్గరకు వచ్చేసరికి నమ్రత ఏమీ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.

సినిమాకు బజ్ రావడం లేదని, సినిమా మీద నమ్మకం పెరగడం లేదని ఫ్యాన్స్ చెబుతున్నా, నమ్రత ఏమీ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం దర్శకుడు వంశీ పైడిపల్లి ఎవ్వరిమాటా వినని సీతయ్య కావడమే అని తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు కూడా వంశీ పైడిపల్లి దగ్గర ఏమీ మాట్లాడలేకపోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కంటెంట్ ఏమిటో, ఎప్పుడు వదులుతారో, సోషల్ నెట్ వర్క్ లోకి ఎవరు వదలాలో అన్నీ దర్శకుడు వంశీ కంట్రోల్ నే అని తెలుస్తోంది. టీమ్ మొత్తాన్ని ఆయన తన ఇంటికే రప్పించి, తనముందే అప్ లోడ్ లాంటి వ్యవహారాలు చేయిస్తున్నట్లు బోగట్టా. రిలీజ్ డేట్, బడ్జెట్ విషయంలో అసంతృప్తితో వున్నారు నమ్రత అని ఆ మధ్య వార్తలు వినవచ్చాయి. ఇప్పుడు సినిమాకు జరుగుతున్న పబ్లిసిటీ విషయంలో కూడా అదే అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది.

సినిమా విడుదల ఇంకో 15రోజులకు కాస్త అటుగా వుంది. కానీ ఇప్పటికీ ఇంకా పబ్లిసిటీ ప్లానింగ్ ఏదీ స్టార్ట్ కాలేదని బోగట్టా. నమ్రత పీఆర్ టీమ్ వేరు. దిల్ రాజు పీఆర్ టీమ్ వేరు. మహేష్ బాబు పీఆర్ వేరు. ఇలా ఎవరికి వారుగా వుంది వ్యవహారం. దీనికితోడు డైరకర్ట్ వంశీ పైడిపల్లి ఎవరికీ ఏమీచెప్పని వైనం. ఇప్పుడే ఇలావుంటే ఇక పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ మినిట్ లో ఇంకెలా వుంటుందో అని కిందామీదా అవుతున్నట్లు బోగట్టా.

రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

జెర్సీ గురించి నాని చెప్పిన నిజాలేంటి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?