Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకీ మీద మైత్రీ రుమాలు

వెంకీ మీద మైత్రీ రుమాలు

హిట్ ట్రాక్ లో వున్న హీరోలు, డైరక్టర్ల మీద ముందుగానే రుమాలు వేసేయడం, అడ్వాన్స్ చేతిలో పెట్టేయడం నిర్మాతలకు అలవాటే. మైత్రీమూవీస్ సంస్థ కూడా ఇలాంటి వ్యవహారాల్లో ముందు వుంటుంది. తొలిప్రేమ, మిస్టర్ మజ్ఞు సినిమాల డైరక్టర్ వెంకీ అట్లూరి మూడో సినిమా ఫిక్స్ అయిపోయినట్లే.

మైత్రీ మూవీస్ సంస్థ వెంకీ అట్లూరితో తరువాత సినిమా చేయబోతున్నామని ప్రకటించేసింది. మిస్టర్ మజ్ఞు సభలోనే మైత్రీ నిర్మాత నవీన్ ఈ విషయం ప్రకటించారు. వెంకీ అట్లూరి తరువాత సినిమా తాము చేయబోతున్నామని తెలిపారు. పనిలో పనిగా అఖిల్ తో కూడా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నామని వెల్లడించారు.

మైత్రీ మూవీస్ దగ్గర చాలామంది హీరోల డేట్లు వున్నాయి. నాని, విజయ్ దేవరకొండ ఇలా. కానీ ప్రతి హీరోకి ఓ డైరక్టర్ ఫిక్స్ అయి వున్నారు. మరి వెంకీ అట్లూరికి ఎవరిని సెట్ చేస్తారో? వెంకీ చేసే జోనర్ లకు యంగ్ హీరోలే కావాల్సి వుంటుంది మరి.

పవన్ ఒంటరిగా పోటీచేస్తే ఎవరికి లాభం?

ఇదేం సినీ అభిమానం.. ఏ రాతి యుగంలో ఉన్నాం?!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?