Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఊ...ఉత్తుత్తినే..?

ఊ...ఉత్తుత్తినే..?

త్వరలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని, సురేందర్ రెడ్డి దానికి స్క్రిప్ట్ రెడీ చేసాడని ఓ గ్యాసిప్ బయటకు వచ్చింది. అయితే ఇది పక్కా గ్యాసిప్ అని, దీని వెనుక అసలు కథ వేరే వుందని, టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ కిక్ 2 సినిమాకు భారీగా ఖర్చు చేసేసాడు. అలా అని వెనకాల అంత వుందా అంటే, పటాస్ కు ముందు కళ్యాణ్ రామ్ ఆర్థికంగా చాలా దెబ్బలు తిన్నాడు. పటాస్ కు కూడా పివిపి సంస్థ దగ్గర కాస్త పెద్ద మొత్తంలో ఫైనాన్స్ తీసుకున్నాడని టాక్. 

అయితే పటాస్ విజయం, ఆ సినిమా మేరకు గట్టెక్కించింది. మరోసారి ట్రయ్ చేయడానికి ధైర్యం ఇచ్చింది. ఇప్పుడు కిక్ 2 చివరకు వచ్చేసరికి మళ్లీ కిందా మీదా అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఎందుకయినా మంచిదని, ముందుగా మరో భారీ ప్రాజెక్టు తమ చేతిలో వుందని ఫీలర్ అక్కడి నుంచే పుట్టిందన్నది ఆ గుసగుసల కొనసాగింపు. 

మరి నిజమెంతో తెలియదు కానీ, సురేందర్ రెడ్డి అయితే రామ్ చరణ్ తరువాతి సినిమాకు లాక్ అయి వున్నాడని, అది భవ్య వాళ్లు నిర్మిస్తారని టాక్ కూడా వుంది. పైగా ఎన్టీఆర్ ప్రాజెక్టు మొదలు కావాలి..పైగా కొరటాల శివ, త్రివిక్రమ్ సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. మరి అలాంటపుడు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, సురేందర్ రెడ్డిల సినిమా ఉత్తిత్తి కబురు కాక ఏమవుతుంది?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?