యాగం వికటిస్తోందా?

జాతస్య మరణం ధృవమ్ అన్నారు. కానీ ఎవరు పోయినా బాధ బాధే. అయితే ఇటీవల టాలీవుడ్ లో మరణాలు ఎక్కువ వుండడంతో మురళీమోహన్ లాంటి పెద్దలు పూనుకుని, ఆధ్యాత్మిక విషయాలతో పాటు, రాజకీయాలు కూడా…

జాతస్య మరణం ధృవమ్ అన్నారు. కానీ ఎవరు పోయినా బాధ బాధే. అయితే ఇటీవల టాలీవుడ్ లో మరణాలు ఎక్కువ వుండడంతో మురళీమోహన్ లాంటి పెద్దలు పూనుకుని, ఆధ్యాత్మిక విషయాలతో పాటు, రాజకీయాలు కూడా కాస్త గట్టిగానే పట్టించుకునే స్వరూపానంద స్వామీజీ సారథ్యంలో మహా మృత్యుంజయ యాగం ప్రారంభించారు. 

సరే, ఈ యాగం వల్ల ఏ ప్రాణాలు నిలబడతాయో ఏమో కానీ, ఇప్పుడు టాలీవుడ్ కొత్త జోక్ వినిపిస్తోంది. ఈ యాగం మొదలు పెట్టగనే అన్నపూర్ణ స్టూడియో ను బ్యాంకు స్వాధీనంలోకి తీసుకున్న వార్త బయటకు వచ్చింది. మరోపక్క దాసరి నారాయణ రావు ఆస్తులపై ఇడి కొరడా అన్న వార్త వినవస్తోంది. 

ఇప్పుడు ఇలాంటి వార్తలు ఇక ఎన్ని వినాల్సి వస్తుందో? మళ్లీ దానికి ఏ యాగం మొదలడతారో అని అంటున్నారు చాటు మాటుగా టాలీవుడ్ జనాలు.