పరుశురామ్-14 రీల్స్..బిగుసుకుంటోంది

అదేంటో… డైరక్టర్ పరుశురామ్ కు 14 రీల్స్ కు ఎందుకో సెట్ కావడం లేదు. డేట్ లు వాళ్లవి..సినిమాలు వేరే వాళ్లవి అన్నది డెస్టినీ. గతంలో ఓసారి ఇలాగే జరిగింది. తమకు సన్నిహతుడైన హీరో…

అదేంటో… డైరక్టర్ పరుశురామ్ కు 14 రీల్స్ కు ఎందుకో సెట్ కావడం లేదు. డేట్ లు వాళ్లవి..సినిమాలు వేరే వాళ్లవి అన్నది డెస్టినీ. గతంలో ఓసారి ఇలాగే జరిగింది. తమకు సన్నిహతుడైన హీరో అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాగే జరుగుతూంటే అలా సరిపెట్టుకోలేకపోతున్నారు. విషయం ఏమిటంటే డైరక్టర్ పరుశురామ్ ఓ సినిమాను 14 రీల్స్ సంస్థకు చేయాలి. నాగ చైతన్యతో సినిమా అనుకున్నారు. అలాంటి టైమ్ లో సర్కారు వారి పాట సినిమా అడ్డం పడింది. ఏం చేయలేక సర్దుకున్నారు.

ఆ సినిమా అయ్యాక మళ్లీ 14 రీల్స్ సినిమా తెరమీదకు వచ్చింది. నాగ్ చైతన్య – పరుశురామ్ ల మధ్య కథల చర్చలు నడిచాయి.  నాగేశ్వరరావు కథ చైతూకి ఓకె…నిర్మాతలకు ఓకె. కానీ పరుశురామ్  మాత్రం ఇంకా బెటర్ కథ చేస్తా అని చెప్పాడు  అది  ఎందుకో సెట్ కాలేదు. హీరోకి ఓకె కాలేదు. దాంతో దర్శకుడు పరుశురామ్ నిర్మాత దిల్ రాజు దగ్గరకు వెళ్లారు. హీరో విజయ్ దేవరకొండకు అదే నాగేశ్వర రావు కథ చెప్పి ఒప్పించుకున్నారు. కానీ ఇది ఎంత వరకు కరెక్ట్ అన్నది పాయింట్.

దాదాపు పది, పన్నెండు కోట్లు తీసుకుని, 14 రీల్స్ ఆఫీసులోనే కథ తయారు చేసి, ఆ కథను వేరే నిర్మాతకు ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అన్నది 14 రీల్స్ నిర్మాతల ఆవేదన. ఈ హీరో ఒప్పుకోకపోతే మరో హీరో ఒప్పుకున్న తరువాత అదే ప్రాజెక్ట్ తమకు చేయాలి కానీ వేరే నిర్మాతకు చేయడం ఎంత వరకు సబబు అన్నది పాయింట్.

ఇప్పుడు ఆ పాయింట్ మీద డిస్కషన్లు సాగుతున్నాయి. ఇటు దిల్ రాజు-అటు 14రీల్స్ అధినేతలు కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సి వుంది. పరుశురామ్ సంగతిని తేల్చుకోవాల్సి వుంది.