Advertisement

Advertisement


Home > Movies - Movie News

డ్రగ్స్, విదేశీ అమ్మాయిలతో ఎంజాయ్ చేసిన హీరో

డ్రగ్స్, విదేశీ అమ్మాయిలతో ఎంజాయ్ చేసిన హీరో

సంచలనం రేపిన శాండిల్ పుడ్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు కొంతమంది తెలంగాణ ఎమ్మెల్యేలతో పాటు టాలీవుడ్ హీరోల పేర్లు తెరపైకొస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేలు, కొంతమంది హైదరాబాద్ పారిశ్రామికవేత్తలపై  దృష్టిపెట్టిన బెంగళూరు సీసీబీ పోలీసులు.. త్వరలోనే ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోల్ని కూడా ప్రశ్నించబోతున్నారు.

2019లో బెంగళూరులో జరిగిన పార్టీలో పాల్గొన్న ఓ తెలుగు హీరో, ఆ పార్టీలో ఇరాన్ దేశానికి చెందిన అమ్మాయిలతో 3 రోజుల పాటు ఎంజాయ్ చేసినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ డ్రగ్స్ రాకెట్ కు సంబంధించి కొన్నాళ్ల కిందట కొంతమంది కొరియర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారంలో ఇద్దరు టాలీవుడ్ హీరోల పేర్లు ఉన్నట్టు బెంగళూరు కేంద్రంగా కథనాలు వస్తున్నాయి.

దీనికి సంబంధించి ఇప్పటికే స్టేట్ మెంట్ నమోదుచేసిన బెంగళూరు పోలీసులు.. ఆ సమాచారాన్ని తెలంగాణ పోలీసులకు అందజేశారు. మరోవైపు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ - సీసీబీ అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలకు నోటీసులిచ్చారు. అయితే ఆ నోటీసులపై వాళ్లింకా స్పందించలేదు.

మరోవైపు బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి వెలుగులోకొచ్చిన ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలపై ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చ మొదలైంది. ఇద్దర్లో ఒకరు ఫ్లాప్ హీరో కాగా, మరొకరు ప్రస్తుతం ఓ మోస్తరు క్రేజ్ ఉన్న నటుడు. అయితే ఇద్దరికీ రాజకీయంగా మంచి పలుకుబడి ఉండడంతో.. ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

అటు బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల పేర్లు కూడా తెరపైకి రావడం వివాదాస్పదమైంది. ఓ ఎమ్మెల్యే ఇటీవల ఓ సెటిల్ మెంట్ కోసం శ్రీలంక వెళ్లి, అక్కడ డ్రగ్స్ సేవించినట్టు ఆరోపణలున్నాయి. ఆ డ్రగ్స్ బెంగళూరు నుంచే సరఫరా అయినట్టు సీసీబీ విచారణలో తేలింది. దీనికి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?