Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ సినిమా నిఖిల్ దగ్గర సెటిలైంది

ఆ సినిమా నిఖిల్ దగ్గర సెటిలైంది

మనం తినే గింజ మీద మన పేరు రాసి వుంటుంది అన్నది పెద్దల మాట. సినిమాలు కూడా అంతే. ఎక్కడెక్కడో తిరిగి, ఆఖరికి ఎక్కడో సెటిల్ అవుతాయి. ఒక్కో హీరో దగ్గరకు వెళ్లి, వచ్చి, ఆఖరికి ఏదో ఒక హీరో దగ్గర సరిపెట్టుకుంటాయి. ఈరోజు అనౌన్స్ చేసిన అల్లు అరవింద్-బన్నీవాస్-ప్రతాప్-నిఖిల్ కాంబినేషన్ సినిమా కథ ఇలాంటిదే.

ఈ సినిమా కథ ను దర్శకుడు ప్రతాప్ ఎప్పటి నుంచో తెరకెక్కించాలని చూస్తున్నారు. ప్రారంభంలో రాజ్ తరుణ్ పేరు వినిపించింది. కానీ అలా వెళ్లి వెళ్లి గీతా సంస్థలోకి వచ్చింది. అక్కడ సాయి ధరమ్ తేజ్ కు వినిపించినట్లు బోగట్టా. కానీ సెకండాఫ్ తేడా అనో మరోటి అనో, రిజెక్ట్ అయిందని గుసగుసలు వున్నాయి.

ఇంతలో నితిన్ తో ఫిక్స్ చేసారు. అనౌన్స్ కూడా చేసేసారు. కానీ మళ్లీ ఏమయిందో? క్యాన్సిల్ అయింది. ఆ తరువాత కొద్ది రోజులుగా కామ్ గా వుండిపోయింది. ఇప్పుడు వున్నట్లుండి అదే సినిమాను నిఖిల్ తో అంటూ ప్రకటించేసారు. 

మరి నితిన్ టైమ్ లో తేడా వచ్చిన కథకు రిపేర్లు జరిగాయో? లేదా అదే కథను నిఖిల్ ఒకె చేసారో? అన్నది తెలియాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?