Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ సినిమా 'పబ్లిక్ లోకి'

ఆ సినిమా 'పబ్లిక్ లోకి'

చాలావరకు సినిమాల గురించి ప్లానింగ్ నుంచే వార్తలు వచ్చేస్తాయి. ఆ తరువాత రెగ్యులర్ అప్ డేట్ లు కూడా వస్తుంటాయి. చిన్న సినిమాల వార్తలు పెద్దగా రావు. కానీ కొన్ని వేరే తరహా సినిమాలు వుంటాయి. వీటి గురించి అస్సలు తెలియదు.

తెలిసాక, ఈ సినిమా ఎప్పుడు ప్లాన్ చేసారా? అనుకోవడం కామన్. నిత్యామీనన్ సినిమా ఒకటి ప్లానింగ్ లో వుంది. ఆ విషయం అలా అలా పైపైన తెలుసు. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది.

పూర్తిగా లండన్ నేపథ్యంలో, అక్కడే షూట్ చేసుకుని, ఫినిష్ అయిన సినిమా ఇది. తెలుగువారికి కూడా పరిచయం వున్న మలయాళ దర్శకుడు ఐవి శశి కుమారుడు అని శశి రూపొందించిన సినిమా ఇది.

ఈ సినిమాలో నిత్యమీనన్, రీతూ వర్మ, అశోక్ సెల్వన్ కీలకపాత్ర ధారులు. అశోక్ సెల్వన్ మన వాళ్లకు పరిచయం తక్కువ కానీ హీరోయిన్లు ఇద్దరూ మన ప్రేక్షకులకు బాగా పరిచయమే.

ఈ ముగ్గురు కీలక పాత్రధారులుగా లండన్ నేపథ్యంలో జరిగే చిన్న థ్రిల్లర్ ఇది. దీనికి నిన్నిలా..నిన్నిలా అనే టైటిల్ పెట్టి, ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

ఈ సినిమా జీ 5 లో విడుదలవుతుందని టాక్ వుంది. సాయి తేజ్ సోలోబతుకే సో బెటరు తో కలిపి బేరం పెట్టారని టాక్ వుంది. మరి థియేటర్ కు వస్తుందో, ఓటిటికి వెళ్తుందో చూడాలి.

జగన్ చేస్తున్నది అర్ధం కావాలంటే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?