తిరుపతి నగరానికి సినీ గ్లామర్ వచ్చేసింది. ఈ నెల 6న తిరుపతి తారకరామా స్టేడియంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక జరగనున్న నేపథ్యంలో, ఆ నగరానికి భారీగా సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అప్పుడప్పుడు ప్రముఖ నటుల సినిమా వేడుకలు జరుగుతుంటాయి. తాజాగా 'ఆదిపురుష్’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తిరుపతిలో గ్రాండ్గా నిర్వహించతలపెట్టారు.
ప్రభాస్ సినిమా కావడంతో అభిమానులు భారీగా తిరుపతికి తరలివస్తారని అంచనా. ఈ సందర్భంగా తిరుపతిలో భారీ పోలీసు బందోబస్తు చేపట్టనున్నారు. సుమారు వెయ్యి మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. భారీగా అభిమానులు రానుండడంతో నగరంలో ట్రాఫిక్ను మళ్లించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఈవెంట్కు ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి హాజరుకానుండడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. ఈ నెల 16న సినిమా విడుదల కానుండడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
రామాయణం కథా నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ జానకిగా, లంకేశ్గా సైఫ్ అలీఖాన్ నటించారు. ఇదిలా వుండగా ప్రీరిలీజ్ ఈవెంట్లో 200 మంది సింగర్స్, 200 మంది డ్యాన్సర్లు ప్రదర్శన ఇవ్వనున్నారంటే… సంబరం ఏ రేంజ్లో వుంటుందో అంచనా వేసుకోవచ్చు.