ఆదిపురుష్ ఈవెంట్ కోసం కోట్ల ఖర్చు

తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఆరవ తేదీన అక్కడ ఈవెంట్ ను భారీగా నిర్వహించేందుకు నిర్మాతలు టీ సిరీస్ ప్లాన్ చేస్తోంది. ఈ ప్లానింగ్ విశేషాలు వింటుంటేనే వావ్ అనేలా వున్నాయి. …

తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఆరవ తేదీన అక్కడ ఈవెంట్ ను భారీగా నిర్వహించేందుకు నిర్మాతలు టీ సిరీస్ ప్లాన్ చేస్తోంది. ఈ ప్లానింగ్ విశేషాలు వింటుంటేనే వావ్ అనేలా వున్నాయి. 

ముంబాయి నుంచి భారీగా సింగర్స్ ను, డ్యాన్సర్స్ ను రప్పిస్తున్నారు ఈ ఈవెంట్ కోసం. 200 మంది డ్యాన్సర్లు, 200 మంది సింగర్స్ వస్తారని తెలుస్తోంది.

ప్రభాస్ తో సహా టోటల్ యూనిట్ అంతా ఈ ఫంక్షన్ కు తరలి వస్తారు. జనం అంచనాకు మించి ఈ ఈవెంట్ కు వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా వుంటే ఓ తరహా ఫైర్ క్రాకర్స్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అయితే అలాంటి ఫైర్ క్రాకర్స్ దొరుకుతాయా లేదా అన్నది ఇంకా తెలియదు. క్రాకర్స్ కాల్చగానే ఆకాశంలో అంతా రంగుల జిలుగులు అలుము కోవడమే కాకుండా ‘జై శ్రీరామ్’ అన్న శబ్దాలు మారు మోగాలి అన్నది ప్లాన్.

కేవలం ఫైర్ వర్క్స్ కోసమే యాభై లక్షలు ఖర్చు లెక్క తేల్తోందని తెలుస్తోంది. ఇవి కాక ఇంకా ఇంకా స్పెషల్ అట్రాక్షన్స్ డిజైన్ చేస్తున్నారు నిర్మాతలు. ఆదిపురుష్ సినిమాను తెలుగులో పీపుల్స్ మీడియా సంస్థ అందిస్తోంది. టోటల్ ఈవెంట్ కోసం ఒకటి నుంచి రెండు కోట్ల రేంజ్ లోనో, అంతకు మించో ఖర్చు అవుతుందని అంచనా.