క‌రోనా నుంచి కోలుకున్న న‌టి, కూతురు

కొన్ని రోజుల కింద‌ట క‌రోనా పాజిటివ్ గా తేలిన న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్, ఆమె కూతురు ఆరాధ్య‌లు క‌రోనా నుంచి కోలుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఐశ్వ‌ర్య భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ ప్ర‌క‌టించారు. తాజా ప‌రీక్ష‌ల్లో…

కొన్ని రోజుల కింద‌ట క‌రోనా పాజిటివ్ గా తేలిన న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్, ఆమె కూతురు ఆరాధ్య‌లు క‌రోనా నుంచి కోలుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఐశ్వ‌ర్య భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ ప్ర‌క‌టించారు. తాజా ప‌రీక్ష‌ల్లో ఐశ్వ‌ర్య‌, ఆరాధ్య‌ల‌కు  క‌రోనా నెగిటివ్ గా వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. దీంతో వారిని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసిన‌ట్టుగా కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. 

ఐశ్వ‌ర్య‌రాయ్ వ‌య‌సు 46 సంవ‌త్స‌రాలు కాగా, ఆమె కూతురు వ‌య‌సు ఎనిమిది సంవ‌త్స‌రాలు. త‌క్కువ రోజుల్లోనే వీళ్లు క‌రోనా నుంచి కోలుకున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. బ‌చ్చ‌న్ల ఫ్యామిలీలో ముందుగా అమితాబ్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఆ విష‌యాన్ని ఆయ‌నే ప్ర‌క‌టించారు. అమితాబ్ కు క‌రోనా పాజిటివ్ గా తేలిన నేప‌థ్యంలో ఆయ‌న కుటుంబీకుల‌ను ఐసొలేష‌న్లో ఉంచారు. అభిషేక్, ఐశ్వ‌ర్య‌, ఆరాధ్య‌లు క‌రోనా పాజిటివ్ గా తేలారు.

చికిత్స‌తో ఐశ్వ‌ర్య‌, ఆరాధ్య‌లు డిశ్చార్జి కాగా… అమితాబ్, అభిషేక్ లు మాత్రం ఇంకా ఆసుప‌త్రిలోనే ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ విష‌యాన్ని అభిషేక్ ప్ర‌క‌టించాడు. త‌ను, త‌న తండ్రి ఇంకా ఆసుప‌త్రిలోనే ఉన్న‌ట్టుగా ఆయ‌న తెలిపాడు.

నా దేవుడ్ని చూస్తే మాటలు రావు