అక్కినేని ఫ్యామిలీ నిర్మాత

గతంలో అక్కినేని నాగార్జున నిర్మాత అంటే కామాక్షి ఫిలింస్ శివప్రసాద్ రెడ్డి గుర్తుకు వచ్చేవారు. పాపం, ఆయన డబ్బులతో సినిమాలు తీసినా నాగ్ బినామీ అనేవారు. ఆఖరికి సినిమాలు తీసి తీసి కొన్ని నష్టాలే…

గతంలో అక్కినేని నాగార్జున నిర్మాత అంటే కామాక్షి ఫిలింస్ శివప్రసాద్ రెడ్డి గుర్తుకు వచ్చేవారు. పాపం, ఆయన డబ్బులతో సినిమాలు తీసినా నాగ్ బినామీ అనేవారు. ఆఖరికి సినిమాలు తీసి తీసి కొన్ని నష్టాలే చవిచూసారు. అది వేరే సంగతి. 

ఇప్పుడు నాగ్ ఫ్యామిలీ తో మరో నిర్మాత బాగా చేరువయ్యారు. ఈ నిర్మాత తొలిసారి సమంత తో యు టర్న్ సినిమా తీసారు. అదే నిర్మాత చిట్టూరి శ్రీను ఇప్పుడు నాగ్ చైతన్య- వెంకట్ ప్రభు కాంబినేషన్ లో కస్టడీ అనే సినిమా చేస్తున్నారు.

ఇప్పుడు లేటెస్ట్ గా నాగార్జునతో ఓ సిన్మా ఓకె చేసేసుకున్నారు. బెజవాడ ప్రసన్న దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అంటే నాగ్ ఫ్యామిలీ నటులతో మూడో సినిమా అన్నమాట. ఇక మిగిలింది అఖిల్ నే. అతగాడితో కూడా ఓ సినిమా సెట్ చేసుకుంటే, ఫ్యామిలీ అంతటితో సినిమాలు నిర్మించినట్లు అవుతుంది.

ప్రస్తుతం చిట్టూరి శ్రీను హీరో రామ్ తో బోయపాటి డైరక్షన్ లో ఓ భారీ సినిమా చేస్తున్నారు. నిర్మాణంలో రెండు సినిమాలు వుండగా, మూడో సినిమాకు శ్రీకారం చుడుతున్నారు.