‘అల’ నెల్లూరు బయ్యర్లకు ‘సరిలేరు’

అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల గురించి విడుదలకు నెల రోజుల ముందు నుంచి కొట్టేసుకుంటున్నారు ఫ్యాన్స్. దాన్ని మరింత రగులుస్తున్నాయి రెండు సినిమాల యూనిట్లు. ఇది చాలదన్నట్లు తనకు అనుకోకుండా, త్రివిక్రమ్ పుణ్యమా…

అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల గురించి విడుదలకు నెల రోజుల ముందు నుంచి కొట్టేసుకుంటున్నారు ఫ్యాన్స్. దాన్ని మరింత రగులుస్తున్నాయి రెండు సినిమాల యూనిట్లు. ఇది చాలదన్నట్లు తనకు అనుకోకుండా, త్రివిక్రమ్ పుణ్యమా అని దొరికిన ఈ సక్సెస్ మరింత హడావుడి చేసేస్తున్నాడు బన్నీ. రోజుకో పార్టీ, వీళ్లతో ఫొటోలు, వాళ్లతో ఫొటోలు కిందా మీదా అయిపోతున్నారు.

ఇలాంటి టైమ్ లో అందరకీ ఆదర్శం అనేలా పార్టీని అరేంజ్ చేసారు నెల్లూరు బయ్యర్లు. అల వైకుంఠపురములో కొన్న భాస్కర్ రెడ్డి, సరిలేరు కొన్న హరి కలిసి జిల్లాలోని ఎగ్జిబిటర్లు అందరికీ ఈ గురువారం లంచ్ ఏర్పాటు చేసారు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేసారు. వేదికపై రెండు సినిమాల ఫ్లెక్సీలు పెట్టారు. ఇన్విటేషన్లు కూడా కంబైన్డ్ గానే. 

నెల్లూరులో ఈ ఇద్దరే పెద్ద బయ్యర్లు. ఇద్దరూ కలిసి కూడా వ్యాపారాలు చేస్తుంటారు. అందుకే ఇద్దరూ కలిసి ఫ్యాన్స్ కు ఓ మంచి సందేశం ఇవ్వాలని డిసైడ్ అయి ఈ విధంగా పార్టీ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా హరి 'గ్రేట్ ఆంధ్ర'తో మాట్లాడుతూ, ఓ మంచి సాంప్రదాయం ఏర్పాటు కావాలి, ఓ మంచి వాతావరణం నెలకొనాలి అనే ఆలోచనతో ఈ విధంగా లంచ్ పార్టీ ఏర్పాటు చేసామన్నారు.

ఈ పార్టీలో సుమారు 250 మంది ఎగ్జిబిటర్లు పాల్కొంటారు. విందు మందు రెండూ వుంటాయి.