Advertisement

Advertisement


Home > Movies - Movie News

త‌న‌పై ‘క‌త్తి’ క‌ట్టారంటున్న యాంక‌ర్‌

త‌న‌పై ‘క‌త్తి’ క‌ట్టారంటున్న యాంక‌ర్‌

రాజ‌కీయ క‌క్ష్య‌తో త‌న‌పై క‌త్తి క‌ట్టార‌ని, ఆ నేప‌థ్యంలోనే క్రిమిన‌ల్ కేసులు పెట్టార‌ని యాంక‌ర్‌, బిగ్‌బాస్ ఫేం క‌త్తి కార్తీక ఆరోపించారు. 52 ఎక‌రాల స్థ‌లాన్ని రూ.35 కోట్ల‌కు ఇప్పిస్తాన‌ని పచ్చిపాల దొరస్వామి అనే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి కోటి రూపాయ‌లు తీసుకున్న ఎపిసోడ్‌లో కార్తీక‌తో పాటు మ‌రో ఆరుగురిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.

బిగ్‌బాస్ ఫేం కావ‌డంతో కార్తీక మోస‌గించ‌డంపై మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో కార్తీక మీడియా ముందుకొచ్చి వివ‌ర‌ణ ఇచ్చారు. రాజ‌కీయ కార‌ణాల వ‌ల్లే త‌న‌పై క్రిమిన‌ల్ కేసు పెట్టార‌ని ఆమె ఆరోపించారు.

మెద‌క్ జిల్లా అమీన్‌పూర్ గ్రామంలోని స‌ర్వే నంబ‌ర్  322, 323, 324, 329లో 52 ఎకరాల స్థలానికి సంబంధించిన గొడ‌వ‌లో తాను ఎవర్నీ మోసం చేయలేదని చెప్పారు. రాజకీయ క‌క్ష‌తోనే త‌న‌పై కేసులు పెడుతున్నారన్నారు.  ఈ విషయమై  సదరు వ్యక్తికి రెండు నెల‌ల క్రితం లీగల్ నోటీసు ఇచ్చిన‌ట్టు కార్తీక చెప్పుకొచ్చారు.

అయితే ఒక్క‌సారిగా రాత్రికి రాత్రి సివిల్ కేసులో చీటింగ్ కేసు నమోదు చేస్తారని యాంక‌ర్ ప్ర‌శ్నించారు. మొన్నటికి మొన్న త‌న‌ను చంపుతామని బెదిరిస్తే రామాయంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన‌ట్టు కార్తీక తెలిపారు.

ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి  ఒక మహిళగా రాజకీయాల్లోకి వస్తే ఇన్ని అడ్డంకులా ? అని ప్ర‌శ్నించారు. అయితే  ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజకీయా లను వీడే ప్ర‌శ్నే లేద‌ని స్ప‌ష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు 2023లో దుబ్బాక నుంచే పోటీ చేస్తానని కత్తి కార్తీక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?