యావ‌న్మందికి రంగ‌మ్మ‌త్త తెలియ‌జేయ‌డం ఏమ‌న‌గా…

రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త‌గా, బుల్లితెర‌పై యాక్టివ్ యాంక‌ర్‌గా అభిమానుల‌ను సంపాదించుకున్న అన‌సూయను ఓ విష‌యం తెగ బాధ‌ప‌డేలా చేస్తోంది. అన‌సూయ ఫొటోను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆమె ఫిర్యాదు. Advertisement…

రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త‌గా, బుల్లితెర‌పై యాక్టివ్ యాంక‌ర్‌గా అభిమానుల‌ను సంపాదించుకున్న అన‌సూయను ఓ విష‌యం తెగ బాధ‌ప‌డేలా చేస్తోంది. అన‌సూయ ఫొటోను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆమె ఫిర్యాదు.

‘హ‌లో ! నాకు సంబంధించిన ఒక ఫొటోను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఇదిగో ఇదే అస‌లైన చిత్రం. ద‌య‌చేసి ఆ మార్ఫింగ్ ఫొటో ఎక్క‌డ క‌న‌ప‌డినా తెలియ‌జేండి. ధ‌న్య‌వాదాలు’ ....ఇన్‌స్టాలో అన‌సూయ విజ్ఞ‌ప్తి.

ఇటు బుల్లితెర‌పై ఎప్ప‌టి నుంచో, అటు వెండితెర‌పై ఇప్పుడిప్పుడే  అనసూయ బిజీగా ఉంటున్నారు. బుల్లితెర‌పై అన‌సూయ‌ త‌న టాలెంట్‌ను నిరూపించుకుని, మ‌రో మెట్టు పైకి అధిరోహించారు. ఇందులో భాగంగానే రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త‌గా కీల‌క రోల్ ల‌భించింది. ఇక అప్ప‌టి నుంచి అన‌సూయ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది.

ప్ర‌స్తుతం రంగ‌మ్మ‌త్త రెండు భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న‌ట్టు తెలిసింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో అవ‌కాశం ల‌భించింది. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రంలో అన‌సూయ‌కు మంచిపాత్ర ద‌క్కిన‌ట్టు స‌మాచారం. అలాగే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్క‌నున్న చిత్రంలో కూడా అన‌సూయ‌కు అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎంతో బిజీగా ఉన్న అన‌సూయ‌ను మార్ఫింగ్ ఫొటో మాత్రం వెంటాడుతుండ‌టం గ‌మ‌నార్హం. 

14 రోజుల్లోనే ఉరి శిక్ష‌