Advertisement

Advertisement


Home > Movies - Movie News

యాంక‌ర్ ప్ర‌దీప్‌పై గుస్సా!

యాంక‌ర్ ప్ర‌దీప్‌పై గుస్సా!

టాలీవుడ్‌లో యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు చెప్పుకోత‌గ్గ అభిమానుల‌ను క‌లిగి ఉన్నారు. ఆయ‌న ప్ర‌తిదీ ఆచితూచి మాట్లాడాల్సిన ప‌రిస్థితి. ఎందుకంటే కొంచెం బ్యాలెన్స్ త‌ప్పినా వివాదం చెల‌రేగుతుంది. ఆయ‌న‌కు వివాదాలు కొత్త‌వి కాదు. 

బ‌హుశా ఆయ‌న‌కు పాపు లారిటీ రావ‌డానికి వివాదాలు కూడా కార‌ణం కావ‌చ్చు. తాజాగా మ‌రోసారి ఆయ‌న మాట‌లు వివాదానికి దారి తీశాయి.

ఓ షోలో యాంక‌ర్ ప్ర‌దీప్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిపై చేసిన వ్యాఖ్య‌పై కొంద‌రు వివాదం సృష్టిస్తున్నారు. హైప‌ర్ ఆది తెలంగాణ‌పై అనుచిత వ్యాఖ్య‌ల వివాదం స‌ద్దుమ‌ణిగిన త‌రుణంలో మ‌రో సెల‌బ్రిటీ కామెంట్‌పై కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌డం విశేషం. 

ఏపీ రాజ‌ధాని విశాఖ అని ప్ర‌దీప్ కామెంట్ చేయ‌డం వివాదానికి దారి తీసింది. ప్ర‌దీప్ రాజ‌ధాని కామెంట్‌పై ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

తన వ్యాఖ్యను ఉపసంహరించుకోవ‌డంతో పాటు క్షమాపణ చెప్పాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. ఒక‌వేళ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్‌లో యాంకర్‌ ప్రదీప్‌ ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి హెచ్చ‌రించింది. 

కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని సంస్థ ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. మ‌రోవైపు రాజ‌ధాని విశాఖ అంటే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించే వాళ్లు లేక పోలేదు. ఈ విష‌యంలో యాంక‌ర్ ప్ర‌దీప్‌న‌కు అండ‌గా ఉంటామ‌ని అభిమానులు చెబుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?