బన్నీతో సినిమాపై స్పందించిన జవాన్ డైరక్టర్

ప్రస్తుతం పుష్ప-2 సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీ తర్వాత అతడు చేయబోయే సినిమాపై చాలా స్పెక్యులేషన్ నడుస్తోంది. లిస్ట్ లో త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ రెడీగా ఉన్నారు. వీళ్లతో పాటు…

ప్రస్తుతం పుష్ప-2 సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీ తర్వాత అతడు చేయబోయే సినిమాపై చాలా స్పెక్యులేషన్ నడుస్తోంది. లిస్ట్ లో త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ రెడీగా ఉన్నారు. వీళ్లతో పాటు అట్లీ పేరు కూడా తరచుగా వినిపిస్తోంది. జవాన్ హిట్టయిన తర్వాత ఈ దర్శకుడి పేరు మరింత గట్టిగా వినిపించడం మొదలైంది.

ఎట్టకేలకు ఈ అంశంపై అట్లీ స్పందించాడు. బన్నీతో చర్చలు జరిగిన మాట వాస్తవమేనని ప్రకటించాడు. ఇద్దరి మధ్య ఓ మంచి పాయింట్ డిస్కషన్ కు వచ్చిందని చెప్పాడు.

“అల్లు అర్జున్ నాకు మంచి స్నేహితుడు. మా టాలెంట్స్ ను పరస్పరం ఇష్టపడతాం. మా ఇద్దరి మధ్య ఓ స్టోరీ ఐడియాపై డిస్కషన్ జరిగిన మాట వాస్తవం. ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయంపై చర్చించుకున్నాం. ఏ సినిమా కార్యరూపం దాల్చినా అది దేవుడి దయ అనుకుంటాను. బన్నీ సినిమాకు కూడా దేవుడి దయ కలిసిరావాలి.”

ఇలా అల్లు అర్జున్ సినిమాపై స్పందించాడు అట్లీ. బన్నీపై ప్రేమతో 'అల్లు సర్' అని పిలిచే అట్లీ.. తన నెక్ట్స్ సినిమా జవాన్ ను మించి ఉంటుందని స్ఫష్టం చేశాడు. అయితే తదుపరి సినిమాకు కాస్త టైమ్ పడుతుందన్నాడు.

“జవాన్ సక్సెస్ నుంచి బయటకు రావడానికి నాకింకా టైమ్ పడుతుంది. జవాన్ సక్సెస్ తో నా బాధ్యత మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని నేను సంతృప్తి పరచాలి. నా నెక్ట్స్ సినిమాను గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లాలి. జవాన్ కంటే పెద్దది ఏదైనా చేయాలి. ప్రస్తుతానికైతే నా కొడుకుతో కొంత సమయం గడుపుతాను. ఆ తర్వాత రైటింగ్ స్టార్ట్ చేస్తాను.”

బన్నీతో ఓ పాయింట్ పై డిస్కషన్ మాత్రమే జరిగిందని వెల్లడించాడు అట్లీ. సో.. ప్రస్తుతం బంతి బన్నీ కోర్టులోనే ఉంది. అతడు త్రివిక్రమ్ తో మరోసారి సెట్స్ పైకి వెళ్తాడా లేక అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది తేలాలి.