అంతా ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది

అఖండ సినిమా హిట్టయిన వెంటనే బాలయ్యతో మరో సినిమా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు బోయపాటి. ఇదే విషయాన్ని బాలయ్య కూడా ఓ సందర్భంలో కన్ ఫర్మ్ చేశాడు. అయితే సినిమా ప్రకటన మాత్రం ఎప్పటికప్పుడు…

అఖండ సినిమా హిట్టయిన వెంటనే బాలయ్యతో మరో సినిమా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు బోయపాటి. ఇదే విషయాన్ని బాలయ్య కూడా ఓ సందర్భంలో కన్ ఫర్మ్ చేశాడు. అయితే సినిమా ప్రకటన మాత్రం ఎప్పటికప్పుడు ఆలస్యమౌతూనే ఉంది. ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది.

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో నాలుగో సినిమాకు రంగం సిద్ధమైంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాణంలో ఈ సినిమా రాబోతోంది. బాలయ్య కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా అని ప్రకటించారు.

ఇంతకుముందు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలొచ్చాయి. ఇవన్నీ హిట్టయ్యాయి. అందుకే వీళ్ల కాంబినేషన్ కు అంత క్రేజ్.

అఖండ తర్వాత అల్లు అరవింద్ కాంపౌండ్ లో ప్రత్యక్షమయ్యాడు బోయపాటి శ్రీను. దీంతో బాలయ్యతో చేయబోయే నాలుగో సినిమా కాస్త లేట్ అవుతుందని అంతా భావించారు. అటు బాలయ్య కూడా మరోసారి పూరి జగన్నాధ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడనే ప్రచారం నడిచింది. కానీ బాలకృష్ణ-బోయపాటి మరోసారి కలిశారు.

ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. అది పూర్తయిన వెంటనే బోయపాటి సినిమా స్టార్ట్ అవుతుంది. బాలకృష్ణ కూతురు తేజశ్విని, ఈ సినిమాకు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.