బాలకృష్ణతో మొదలై… అక్కడ సెటిలైంది!

మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ హక్కులని సొంతం చేసుకున్న సూర్యదేవర నాగవంశీ తెలుగులో క్రేజీ వెంఛర్‌గా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాలని భావించినా ఆ రేంజ్ ప్రాజెక్ట్ కావడం లేదు.…

మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ హక్కులని సొంతం చేసుకున్న సూర్యదేవర నాగవంశీ తెలుగులో క్రేజీ వెంఛర్‌గా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాలని భావించినా ఆ రేంజ్ ప్రాజెక్ట్ కావడం లేదు.

తెలుగు వెర్షన్‌లో బాలకృష్ణతో పోలీస్ క్యారెక్టర్ చేయించాలని పలుమార్లు ప్రయత్నించారు. కానీ బాలకృష్ణ ఆ క్యారెక్టర్ చేయడానికి ఆసక్తి చూపించలేదు.

మరో పాత్రకి రానా దగ్గుబాటి ఖరారు కాగా, పోలీస్ క్యారెక్టర్‌ని వెంకటేష్‌తో చేయిద్దామనుకున్నారు. కానీ రానాతో తలపడే పాత్ర చేయడానికి వెంకటేష్ ఆసక్తి చూపించలేదు. దాంతో ఆ పాత్ర పట్ల ఆసక్తి చూపించిన రవితేజను అప్రోచ్ అయ్యారు.

ఫైనల్‌గా రవితేజ, రానాతో తెలుగు రీమేక్ ఖరారు చేసుకున్నారు. ఈ చిత్రానికి దర్శకుడిగా ఎవరయినా లీడింగ్ డైరెక్టర్‌ని పెట్టాలనుకున్నారు కానీ అదీ జరగలేదు.

‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే చిత్రం తెరెకక్కించిన సాగర్ చంద్ర తెలుగు రీమేక్ డైరెక్ట్ చేయబోతున్నాడు. తెలుగు వెర్షన్‌ని యథాతథంగా తీయకుండా రవితేజ, రానా బాడీ లాంగ్వేజ్‌కి, మన నేటివిటీకి అనుగుణంగా మారుస్తున్నారట.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళతారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా రానా వ్యవహరిస్తాడు.