ఎక్కడ గిచ్చాలో అక్కడే గిల్లిన బాలయ్య

అన్ స్టాపబుల్ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి బాలయ్య ఎప్పీయరెన్స్ ఒక కారణమైతే, అందులో బాలయ్య అడిగే ప్రశ్నలు, తుంటరితనం మరో ఎత్తు. అయితే ఎప్పుడైతే రాజకీయ రంగు పులుముకుందో అప్పుడే ఆ కార్యక్రమం మసకబారింది.…

అన్ స్టాపబుల్ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి బాలయ్య ఎప్పీయరెన్స్ ఒక కారణమైతే, అందులో బాలయ్య అడిగే ప్రశ్నలు, తుంటరితనం మరో ఎత్తు. అయితే ఎప్పుడైతే రాజకీయ రంగు పులుముకుందో అప్పుడే ఆ కార్యక్రమం మసకబారింది. దీనికి మళ్లీ పూర్వ వైభవం తెచ్చే పనిలో పడింది 'ఆహా'.

ఇందులో భాగంగా లిమిటెడ్ ఎడిషన్ ప్రవేశపెట్టిన సదరు ఓటీటీ.. ప్రస్తుతానికైతే రాజకీయాలకు దూరంగా తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. భగవంత్ కేసరి యూనిట్ తో చిట్ చాట్ పెట్టిన బాలయ్య, ఇప్పుడు యానిమల్ యూనిట్ తో మాటామంతీ కలిపారు.

కార్యక్రమానికి వచ్చిన హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక, దర్శకుడు సందీప్ రెడ్డి వంగను తన కొంటెతనం, తుంటరి ప్రశ్నలతో ఓ రేంజ్ లో ఆడుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఎవ్వర్ని ఏ ప్రశ్నలు అడిగితే తమాషాగా ఉంటుందో అవే ప్రశ్నలు సంధించారు బాలయ్య. ముందుగా సందీప్ రెడ్డి వంగ దగ్గరకు వచ్చారు. ఏ బ్రాండ్ అని అడిగారు, తన బ్రాండ్ కు మారిపోవాలని, అప్పుడు జోరుగా స్టోరీలు రాయొచ్చని సూచించారు. ఆ తర్వాత రష్మిక వంతు.

విజయ్ దేవరకొండ, రష్మిక డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆ కోణంలో ఆడుకున్నారు బాలయ్య. షోలోనే విజయ్ దేవరకొండకు ఫోన్ చేశారు. మేడ మీద పార్టీలేంటంటూ ప్రశ్నించారు. రష్మికను తను ప్రేమిస్తున్నానంటూ టీజ్ చేశారు. ఇక రణబీర్ విషయానికొస్తే.. అలియా సోషల్ మీడియా ఎకౌంట్ కాకుండా, వేరే ఎవరి ఎకౌంట్ ను సీక్రెట్ గా ఫాలో అవుతావంటూ ప్రశ్నించి ఇబ్బందిపెట్టారు.