పవన్ కల్యాణ్ నుంచి బెల్లంకొండ వరకు..!

సంతోష్ శ్రీనివాస్ అలియాస్ కందిరీగ శ్రీనివాస్ గుర్తున్నాడా? Advertisement అప్పుడెప్పుడో మూడేళ్ల కిందట వచ్చిన హైపర్ మూవీ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు ఈ దర్శకుడు. ఇన్నాళ్లకు సంతోష్ శ్రీనివాస్ మళ్లీ వార్తల్లోకెక్కాడు. బెల్లంకొండ…

సంతోష్ శ్రీనివాస్ అలియాస్ కందిరీగ శ్రీనివాస్ గుర్తున్నాడా?

అప్పుడెప్పుడో మూడేళ్ల కిందట వచ్చిన హైపర్ మూవీ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు ఈ దర్శకుడు. ఇన్నాళ్లకు సంతోష్ శ్రీనివాస్ మళ్లీ వార్తల్లోకెక్కాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తో కొత్త సినిమా ప్రకటించాడు. ఈనెల 29న ఈ సినిమా లాంఛ్ అవుతుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

అయితే బెల్లంకొండతో సంతోష్ శ్రీనివాస్ చేయబోయే ఆ సినిమా కథ ఏమై ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ దర్శకుడి వద్ద ఓ కథ చాన్నాళ్లుగా నలుగుతోంది. తమిళ్ లో వచ్చిన తేరి సినిమా లైన్ లో ఆ కథ సాగుతుంది. ముందుగా పవన్ కల్యాణ్ తో సినిమా చేద్దాం అనుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ లో చాలా సిట్టింగ్స్ నడిచాయి.

కట్ చేస్తే, అదే కథతో రవితేజ వద్దకు మారింది పంచాయితీ. అక్కడ కూడా చాలా సిట్టింగ్స్ నడిచాయి. కానీ ఎందుకో అక్కడ కూడా వర్కవుట్ కాలేదు. అలా బ్యానర్లు, హీరోలు మారి ఇప్పుడు బెల్లంకొండ వద్దకొచ్చి ఆగాడు సంతోష్ శ్రీనివాస్. అప్పుడు పవన్ కోసం, ఆ తర్వాత రవితేజ కోసం అనుకున్న కథతోనే ఈ బెల్లంకొండ సినిమా రాబోతోంది.

అదేంటో.. బెల్లంకొండకు అన్నీ ఇలాంటి ఆఫర్లే వస్తున్నాయి. ఎవరో చేయాల్సిన రాక్షసుడు సినిమాను ఇతడు చేశాడు. గజదొంగ నాగేశ్వరరావు కథతో రానా చేయాల్సిన సినిమా కూడా బెల్లంకొండ దగ్గరే ఉంది. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ సినిమా కూడా. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.