అంధాధూన్.. పృథ్విరాజ్ వెర్ష‌న్ చూస్తారా?

డ్రైవింగ్ లైసెన్స్, అయ్య‌ప‌నుమ్ కోషియుం సినిమాల‌తో ప‌క్క భాష‌ల్లో కూడా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న పృథ్విరాజ్ సుకుమార‌న్ ఓటీటీల్లో వ‌ర‌స పెట్టి సినిమాల‌ను విడుద‌ల చేస్తున్నాడు. ఇటీవ‌లే పృథ్వి న‌టించిన కోల్డ్ కేస్,…

డ్రైవింగ్ లైసెన్స్, అయ్య‌ప‌నుమ్ కోషియుం సినిమాల‌తో ప‌క్క భాష‌ల్లో కూడా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న పృథ్విరాజ్ సుకుమార‌న్ ఓటీటీల్లో వ‌ర‌స పెట్టి సినిమాల‌ను విడుద‌ల చేస్తున్నాడు. ఇటీవ‌లే పృథ్వి న‌టించిన కోల్డ్ కేస్, కురుతి వంటి సినిమాలు అమెజాన్లో వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రో సినిమా రాబోతోంది. ఇది తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన సినిమానే.

ఇటీవ‌లే నితిన్ హీరోగా తెలుగులో వ‌చ్చిన మైస్ట్రో సినిమా మ‌ల‌యాళీ వెర్ష‌న్ విడుద‌ల‌కు రెడీ అవుతోంది. హిందీ సూప‌ర్ హిట్ అంధాధూన్ కు రీమేక్ సినిమాలు ఇవ‌న్నీ. తెలుగులో నితిన్ చేసిన పాత్ర‌ను మ‌ల‌యాళం వెర్ష‌న్లో పృథ్విరాజ్ చేస్తున్నాడు. 

భ్ర‌మం పేరుతో మ‌ల‌యాళంలో ఈ సినిమా రెడీ అయ్యింది. డైరెక్ట్ ఓటీటీ విడుద‌ల‌గా వ‌స్తోంది. ర‌వి కే చంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది. అక్టోబ‌ర్ ఏడో తేదీన ఈ సినిమా అమెజాన్ లో విడుద‌ల కాబోతోంది. 

టబు చేసిన పాత్ర‌లో మ‌మ‌తా మోహ‌న్ దాస్ క‌నిపిస్తూ ఉండ‌గా, రాశీ ఖ‌న్నా మ‌రో పాత్ర‌లో క‌నిపిస్తోంది. ఎలాగూ ఓటీటీ విడుద‌లే కాబ‌ట్టి.. అంధాధూన్ పృథ్విరాజ్ వెర్ష‌న్ ను చూడ‌టానికి అవ‌కాశం ఉన్న‌ట్టే.