బాలీవుడ్ బాటలో జనగనమణ

దర్శకుడు పూరి జగన్నాధ్ కు ప్రియమైన ప్రాజెక్టు 'జనగనమణ'. హీరో మహేష్ బాబుతో తీయాలని ప్రయత్నించిన ప్రాజెక్టు. సొసైటీ మీద, పోలిటిక్స్ మీద బలమైన డైలాగులతో కూడిన సబ్జెక్ట్ ఇది.  Advertisement అప్పటి నుంచి…

దర్శకుడు పూరి జగన్నాధ్ కు ప్రియమైన ప్రాజెక్టు 'జనగనమణ'. హీరో మహేష్ బాబుతో తీయాలని ప్రయత్నించిన ప్రాజెక్టు. సొసైటీ మీద, పోలిటిక్స్ మీద బలమైన డైలాగులతో కూడిన సబ్జెక్ట్ ఇది. 

అప్పటి నుంచి అలాగే వుంది. ఎప్పటికైనా ఈ సెన్సెషనల్ స్క్రిప్ట్ ను తెరకెక్కించాలన్నది పూరి కోరిక. ఈ కోరికను ఆయన త్వరలో తీర్చుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం బాలీవుడ్ లో లైగర్ సినిమాను పూరి నిర్మిస్తున్నారు. దాని తరువాత మళ్లీ అదే హీరోతో బాలీవుడ్ లోనే జనగనమణ సినిమాను తెరకెక్కించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలకపాత్రలో బాలీవుడ్ బాద్ షా అమితాబ్ నటించే అవకాశం వుందని బోగట్టా. అలాగే విలన్ గా అజయ్ దేవగన్ ను తీసుకోవాలని పూరి ఆలొచనగా వినిపిస్తోంది.

పూరి తరువాత సినిమా బాలకృష్ణతో అనే గ్యాసిప్ ఒకటి వుండనే వుంది. కానీ జనగనమణనే పూరి తరువాత ప్రాజెక్టు అని దాని మీదే ఆయన గట్టిగా వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది.