రష్మిక జోరుకి కళ్లెమేసిన కరోనా

‘సరిలేరు నీకెవ్వరు’ విజయంతో ఇక రష్మిక వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తుందని భావించారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన అవకాశం వచ్చింది కనుక ఇక ఆ జోరు అలాగే కొనసాగుతుందని అనుకున్నారు.…

‘సరిలేరు నీకెవ్వరు’ విజయంతో ఇక రష్మిక వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తుందని భావించారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన అవకాశం వచ్చింది కనుక ఇక ఆ జోరు అలాగే కొనసాగుతుందని అనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ రష్మిక కెరీర్‌పై కూడా పడింది. 

లాక్‌డౌన్ వల్ల అందరి ప్లాన్స్ తారుమారు అవడంతో అగ్ర హీరోలంతా ఇంకా పూర్తి కాని సినిమాలతో లాక్ అయి వున్నారు. ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ వేరే సినిమాలు మొదలు పెట్టడానికి చాలా సమయం వుంది. 

మహేష్ తదుపరి చిత్రంలో రష్మిక ఎలాగో నటించడం లేదు. దీంతో పుష్ప మినహా తన చేతిలో పెద్ద సినిమా ఏదీ లేదు. దీంతో మంచి పారితోషికం ఆఫర్ చేసారని ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాలో శర్వానంద్‌తో నటిస్తోంది.

మీడియం బడ్జెట్ సినిమాలో రష్మిక వుంటే క్రేజ్ బాగా వస్తుంది కనుక ఆ చిత్ర నిర్మాతలు తనకు రెండు కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. 

అగ్ర హీరోల సరసన నటిస్తూ నంబర్‌వన్ అనిపించుకునే దిశగా దూసుకుపోవాల్సిన రష్మిక అలా లాభపడకపోయినా ఇలా భారీ పారితోషికం అందుకుంటోందన్నమాట. 

అయితే చిన్న సినిమాకు రష్మిక అంత ఈజీగా డేట్స్ ఇవ్వడం లేదనుకోండి. తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం వుంటేనే ఆ ఆఫర్స్ కన్సిడర్ చేస్తోంది. 

బాబుగారి ఆటకోసం ఎవ‌రో ఒక‌రు బలి