ప్రభాస్ సినిమాలపై కరోనా ఎఫెక్ట్

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ప్రభాస్ నటిస్తున్న 3 సినిమాలపై కరోనా ప్రభావం పడింది. దీంతో ఆ 3 సినిమాల షెడ్యూల్స్, రిలీజ్ డేట్స్ తారుమారయ్యాయి.   Advertisement ముందుగా ఆదిపురుష్ విషయానికొద్దాం. ముంబయిలో…

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ప్రభాస్ నటిస్తున్న 3 సినిమాలపై కరోనా ప్రభావం పడింది. దీంతో ఆ 3 సినిమాల షెడ్యూల్స్, రిలీజ్ డేట్స్ తారుమారయ్యాయి.  

ముందుగా ఆదిపురుష్ విషయానికొద్దాం. ముంబయిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏకంగా 40 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ సెకెండ్ వేవ్ ముంబయిని గట్టిగా తాకింది. షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ఆదిపురుష్ ప్రాజెక్టును పక్కనపెట్టి, హైదరాబాద్ వచ్చేశాడు ప్రభాస్.

ఆదిపురుష్ ఆగిపోవడంతో ఆ ప్రభావం నాగ్ అశ్విన్ తో చేయాల్సిన సినిమాపై పడింది. సైన్స్-ఫిక్షన్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాను జులై నుంచి సెట్స్ పైకి తీసుకొస్తామని కొన్ని రోజుల కిందట నాగ్ అశ్విన్ ప్రకటించాడు. 

కానీ ఆదిపురుష్ ఆలస్యమవ్వడంతో నాగ్ అశ్విన్ సినిమా అక్టోబర్ కు వాయిదా పడింది. ఆదిపురుష్ పూర్తయిన తర్వాతే సైన్స్-ఫిక్షన్ మూవీ స్టార్ట్ చేస్తానంటూ నాగ్ అశ్విన్ కు చెప్పేశాడు ప్రభాస్. మరోవైపు రాధేశ్యామ్ పై కూడా కరోనా ప్రభావం పడేలా ఉంది. లెక్కప్రకారం ఈ సినిమా జులై 30న రిలీజ్ అవ్వాలి. 

కానీ బడా సినిమాలన్నీ వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో రాధేశ్యామ్ కూడా వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోది. నిన్నట్నుంచి ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. ప్రభాస్ కు సంబంధించి కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేస్తున్నారు.