Advertisement

Advertisement


Home > Movies - Movie News

కోర్టుకీడుస్తాః ప్ర‌ముఖ న‌టి వార్నింగ్‌

కోర్టుకీడుస్తాః ప్ర‌ముఖ న‌టి వార్నింగ్‌

త‌న ఆరోగ్యంపై ర‌క‌ర‌కాల పుకార్లు పుట్టిస్తున్న వాళ్లకు ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి రాధిక‌ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వాళ్ల‌ను కోర్టుకీడుస్తాన‌ని హెచ్చ‌రించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నాకు కరోనా వైరస్‌ సోకలేదు. వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. వృత్తిపరమైన జీవితంలో బిజీ అయ్యాను. నా ఆరోగ్యంపై కొంద‌రు వదంతులు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ పుకార్లు పుట్టిస్తున్న వాళ్ల‌పై న్యాయస్థానంలో పోరాటం చేస్తా’ అని రాధిక హెచ్చ‌రించారు.

రాధిక కొవిడ్‌-19 బారిన పడ్డారంటూ గత కొన్నిరోజులుగా సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆమె నేడు సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. 

చెక్‌బౌన్స్ కేసులో రాధిక‌, ఆమె భ‌ర్త శ‌ర‌త్‌కుమార్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ నిన్న చెన్నై కోర్టు తీర్పునిచ్చిన నేప‌థ్యంలో వాళ్లిద్ద‌రు వార్త‌ల‌కెక్కిన విష‌యం తెలిసిందే. తాజాగా రాధిక వార్నింగ్ ట్వీట్‌తో మరోసారి చ‌ర్చ‌కు తెర‌లేపారు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?