దిల్ రాజు మరో రిస్క్ చేస్తున్నాడా?

దిల్ రాజుకు రిస్క్ చేయడం కొత్త కాదు. కాకపోతే తను సేఫ్ అనుకున్న టైమ్ లో మాత్రమే రిస్క్ చేశాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఉదాహరణకు బలగం సినిమానే తీసుకుంటే.. నాన్-థియేట్రికల్ రైట్స్ తోనే…

దిల్ రాజుకు రిస్క్ చేయడం కొత్త కాదు. కాకపోతే తను సేఫ్ అనుకున్న టైమ్ లో మాత్రమే రిస్క్ చేశాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఉదాహరణకు బలగం సినిమానే తీసుకుంటే.. నాన్-థియేట్రికల్ రైట్స్ తోనే బ్రేక్ ఈవెన్ అయిపోయాడు. కాబట్టి కళ్లుమూసుకొని ఆ సినిమాను థియేటర్లలోకి దించాడు. సినిమా సక్సెస్ అయింది, అది వేరే విషయం. ఫ్లాప్ అయినా దిల్ రాజుకు వచ్చిన నష్టం లేదిక్కడ.

అయితే ఈసారి మాత్రం దిల్ రాజు నిజంగానే రిస్క్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. దీనికి కారణం శాకుంతలం సినిమా. సమంత లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాకు గుణశేఖర్ తో పాటు దిల్ రాజు కూడా నిర్మాత. ఇప్పుడీ సినిమాను బలగం టైపులో విడుదలకు చాలా రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేస్తున్నారు. 

హాలీవుడ్ లో ఈ పోకడ ఉంది. టాక్ తో సంబంధం లేకుండా ఓ సెక్షన్ ఆడియన్స్ కు, కొంతమంది ప్రముఖులు, క్రిటిక్స్ కు అక్కడ సినిమాను ముందుగానే చూపిస్తారు. బలగం సినిమాకు దిల్ రాజు అదే పని చేశారు. ఇప్పుడు శాకుంతలం సినిమాకు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు.

నిన్న రాత్రి నుంచే శాకుంతలం స్పెషల్ ప్రీమియర్స్ పడుతున్నాయి. ఇది దిల్ రాజు చేస్తున్న పెద్ద రిస్క్ గా చెబుతున్నారు చాలామంది. ఎందుకంటే, శాకుంతలం అనేది చిన్న సినిమా కాదు. భారీ బడ్జెట్ సినిమా ఇది. గ్రాఫిక్స్ కోసమే కోట్లు ఖర్చుపెట్టారు. పైగా పలుమార్లు వాయిదా పడ్డంతో బడ్జెట్ ఆటోమేటిగ్గా పెరిగినట్టయింది. 

ఇలాంటి సినిమాను ఇలా ముందుగానే కొందరికి చూపించి దిల్ రాజు రిస్క్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. సినిమాకు హిట్ టాక్ వస్తే ఓకే. నెగెటివ్ టాక్ వస్తే మాత్రం అది మొదటి రోజు వసూళ్లపై పెద్ద ప్రభావం చూపిస్తుంది. మరీ ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. 

అయితే అంతా భయపడినట్టే శాకుంతలం సినిమా స్పెషల్ ప్రీమియర్స్ కు 'వావ్' అనిపించే టాక్ రాలేదు. పైకి కొంతమంది బాగుందన్నప్పటికీ, ఇన్ సైడ్ టాక్ మాత్రం యావరేజ్ అని వచ్చిందంట. రేపు మీడియాకు కూడా షో వేయబోతున్నాడు దిల్ రాజు. అదే కనుక జరిగితే అది మరింత రిస్కీ అవుతుందేమో.