జరగండి.. జరగండి.. ఆ సాంగ్ రావట్లేదు

గేమ్ ఛేంజర్ నుంచి మరికొన్ని గంటల్లో సాంగ్ రిలీజ్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రోమో రాలేదు కాబట్టి వాళ్లకు మరోవైపు అనుమానం కూడా ఉంది. Advertisement ఆ అనుమానాలు…

గేమ్ ఛేంజర్ నుంచి మరికొన్ని గంటల్లో సాంగ్ రిలీజ్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రోమో రాలేదు కాబట్టి వాళ్లకు మరోవైపు అనుమానం కూడా ఉంది.

ఆ అనుమానాలు నిజం చేస్తూ, గేమ్ ఛేంజర్ సినిమా నుంచి 'జరగండి సాంగ్ ' రావడం లేదంటూ ఇప్పటికే కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్పుకొచ్చారు. మంచి క్వాలిటీ కోసం తమన్ మరింత టైమ్ తీసుకుంటున్నాడని, ఆల్రెడీ లీక్ అయిన క్లిప్ పై వచ్చిన నెగెటివ్ కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని, ఎక్స్ ట్రా కేర్ తీసుకుంటున్నాడని కొందరన్నారు.

మరికొందరు మాత్రం తప్పంతా శంకర్ దే అన్నారు. భారతీయుడు-2పై దృష్టిపెట్టిన శంకర్, గేమ్ ఛేంజర్ సాంగ్ రిలీజ్ ను లైట్ తీసుకున్నాడని, మరో డేట్ కు సాంగ్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశాడంటూ కథనాలు వచ్చాయి.

ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాడు నిర్మాత దిల్ రాజు. గేమ్ ఛేంజర్ సాంగ్ రిలీజ్ చేయడం లేదని ప్రకటించిన ఈ నిర్మాత, వాయిదాకు అసలు కారణాన్ని వెల్లడించాడు.

వివిధ కంపెనీల మధ్య ఆడియో రైట్స్ డాక్యుమెంటేషన్ కు సంబంధించి సంతకాల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో, సాంగ్ రిలీజ్ ను వాయిదా వేసినట్టు అసలు కారణాన్ని వెల్లడించాడు రాజు. త్వరలోనే పాట విడుదలకు సంబంధించి కొత్త అప్ డేట్ తో వస్తామని ఆయన క్లారిటీ ఇచ్చాడు.

చరణ్, శంకర్ అభిమానుల వెయిటింగ్ కు న్యాయం చేసేలా సాంగ్ ఉంటుందని ప్రకటించాడు దిల్ రాజు. మంచి క్వాలిటీతో సినిమా తెరకెక్కుతుందని ఈ సందర్భంగా తెలిపాడు. చరణ్-శంకర్ ఫ్రెష్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్.