ఎన్టీఆర్, ప్రభాస్ తో సినిమాలు.. సెకెండ్ రౌండ్ స్టార్ట్

అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోలందరితో ఓ రౌండ్ సినిమాలు చేసేశాడు దిల్ రాజు. ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ లాంటి హీరోలకు దూరమయ్యాడు. ఇప్పుడు…

అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోలందరితో ఓ రౌండ్ సినిమాలు చేసేశాడు దిల్ రాజు. ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ లాంటి హీరోలకు దూరమయ్యాడు. ఇప్పుడు ఆ స్టార్ హీరోలందరితో సెకెండ్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాడు ఈ టాప్ ప్రొడ్యూసర్.

ప్రభాస్, ఎన్టీఆర్ తో ఆల్రెడీ సినిమాలు లాక్ అయినట్టు ప్రకటించాడు దిల్ రాజు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమా లాక్ అయిందని తెలిపిన రాజు.. 2024లో మరో పెద్ద సినిమా స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.

“స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా అంటున్నారు. ప్రస్తుతం వాళ్లు చేస్తున్న సినిమాలు ఎలా వస్తున్నాయో చూడాలి. వాళ్ల లైనప్ చెక్ చేయాలి. ఆ కమిట్ మెంట్స్ తర్వాత నా సినిమా కచ్చితంగా ఉంటుంది. ఎన్టీఆర్, ప్రభాస్ తో సినిమాలు లాక్ అయ్యాయి. బన్నీతో ఆల్రెడీ కథాచర్చలు సాగుతున్నాయి. చరణ్ తో సినిమా సెట్స్ పై ఉంది.”

ఇలా మరోసారి స్టార్ హీరోలతో సినిమాలు ఎనౌన్స్ చేశాడు దిల్ రాజు. పవన్ కల్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా తీసిన ఈ నిర్మాత, మరోసారి పవన్ తో సినిమా చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశాడు. రాజమౌళి సినిమా వల్ల మహేష్ 2-3 ఏళ్లు అందుబాటులోకి రాడని, ఆ తర్వాత మహేష్ తో కూడా ఓ సినిమా ఉంటుందని ప్రకటించాడు.

స్టార్ హీరోలతో దిల్ రాజుకు చాలా గ్యాప్ వచ్చేసిందంటూ ఈమధ్య కొన్ని కథనాలు వచ్చాయి. వాటిపై స్పందిస్తూ పైవిధంగా రెస్పాండ్ అయ్యాడు దిల్ రాజు. తనకు ఏ స్టార్ హీరోతో గ్యాప్ లేదని, బయట చాలామంది ఏదో అనుకుంటారని, తనకు మాత్రం ప్రతి స్టార్ తో సత్సంబంధాలున్నాయని తెలిపాడు.