Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇంటి ఫంక్షన్ కు సొంత కోడలు డుమ్మా

ఇంటి ఫంక్షన్ కు సొంత కోడలు డుమ్మా

అట్టహాసంగా జరిగింది ఏఎన్నార్ జాతీయ అవార్డ్ ఫంక్షన్. ఇంకా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీ ఫంక్షన్ ను తలపించింది. నాగార్జున నుంచి మొదలుపెడితే.. థర్డ్ జనరేషన్ హీరోల వరకు అంతా వచ్చారు. అలా "అన్నపూర్ణ" కళకళలాడిపోయింది. కానీ ఒకటే వెలితి. వేర్ ఈజ్ సమంత.

అవును.. మొత్తం ఫ్రేమ్ లో సమంత మిస్సింగ్. పోనీలే పోయింది అనుకోవడానికి వీల్లేని క్యాండిడేట్. ఎందుకంటే ఈమె అక్కినేని కోడలు. స్వయానా నాగార్జున కోడలు. హీరో నాగచైతన్య భార్య. అఖిల్ వదిన. అన్నింటికీ మించి స్టార్ హీరోయిన్. ఇలా చెప్పుకుంటూ పోతే సమంత గైర్హాజరీని లైట్ తీసుకోవడానికి వీల్లేనన్నికారణాలున్నాయి.

చిరంజీవి లాంటి మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బయట నుంచి విజయ్ దేవరకొండ లాంటి స్టార్ కూడా వచ్చాడు. కానీ సొంత కాంపౌండ్ లో ఉన్న స్టార్ సమంత మాత్రం రాకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ఈవెంట్ లో ఎంక్వయిరీలు కూడా జరిగాయి.

ఇంతకీ సమంత ఏమైపోయింది. హైదరాబాద్ లోనే జరిగిన ఈ ఫంక్షన్ కు ఆమె ఎందుకు హాజరుకాలేదు. నిజానికి సమంత ఈమధ్య పబ్లిక్ ఎప్పీయరెన్స్ తగ్గించేసింది. ఒకప్పుడు చిన్న చిన్న ఈవెంట్లలో కూడా మెరిసిన ఈ బ్యూటీ, ఇప్పుడు కెమెరా కంటికే కనిపించడం మానేసింది.

అలా అని ఆమె తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉందా అంటే అది కూడా లేదాయె. సమంత ఇప్పటివరకు తన కొత్త ప్రాజెక్టును అధికారికంగా ఎనౌన్స్ చేయలేదు. ఓ వెబ్ సిరీస్ కు మాత్రం ఓకె చెప్పింది. అన్నింటికంటే కొసమెరుపు ఏంటంటే.. ఆమె హైదరాబాద్ లోనే ఉంది. అయినా ఫంక్షన్ కు రాలేదు. సమంత గైర్హాజరీపై అక్కినేని కాంపౌండ్ మౌనంగా ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?