Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఒకటే వసూళ్లు... రిజల్ట్ మాత్రం వేరు

ఒకటే వసూళ్లు... రిజల్ట్ మాత్రం వేరు

సరిగ్గా వారం కిందట ఎవరు, రణరంగం సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. రెండు సినిమాలు ఒకేరోజు రిలీజయ్యాయి. గమ్మత్తుగా ఈ రెండు సినిమాలకు వసూళ్లు కూడా ఒకేలా వచ్చాయి. కానీ రిజల్ట్ మాత్రం ఒకేలాలేదు. క్రిటిక్స్, రివ్యూస్ పరంగా కూడా ఈ రెండు ఒకేలాలేవు.

నిన్నటితో వారంరోజుల రన్ పూర్తిచేసుకుంది ఎవరు సినిమా. అడవి శేష్, రెజీనా, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు నిన్నటి వసూళ్లతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ అటుఇటుగా 9 కోట్ల 50 లక్షలు చేశారు. కాబట్టి ఈ సినిమా దాదాపు బ్రేక్-ఈవెన్ అయినట్టే.

రణరంగం సినిమా కూడా నిన్నటితో 7 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు కూడా మొదటి వారం 9 కోట్లు వచ్చాయి. కానీ సినిమా మాత్రం కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే ఈ సినిమా 17 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. బ్రేక్-ఈవెన్ అవ్వాలంటే మరో 8 కోట్లు కావాలి. మరో వారంరోజుల్లో సాహో వచ్చేస్తోంది. ఉన్న ఈ వారంలో దీనికి 8 కోట్లు రావడం దాదాపు అసాధ్యం.

అటు క్రిటిక్స్ పరంగా కూడా ఈ రెండు సినిమాల మధ్య తేడా స్పష్టంగా కనిపించింది. విడుదలైన మొదటిరోజే ఎవరు సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చాయి. ఆ రేటింగ్స్, రివ్యూస్ కు తగ్గట్టే సినిమా రిజల్ట్ ఉంది. రణరంగం సినిమాకు మొదటిరోజే నెగెటివ్ మార్కులు పడ్డాయి. దానికి తగ్గట్టుగానే సినిమా వీక్ డేస్ లో చతికిలపడింది. ప్రస్తుతానికైతే ఈ రెండు సినిమాల్లో ఉన్నంతలో ఎవరు మాత్రమే ఆడుతోంది.

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?