ఎక్స్ క్లూజివ్ – క్రేజీ కాంబినేషన్ తో ‘మలినేని’

మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సరికొత్త కాంబినేషన్ కు రంగం సిద్దం చేసారు. మాస్ మహరాజా రవితేజ- నేషనల్ క్రష్ రష్మిక లను జోడీగా సెట్ చేసుకున్నారు.  Advertisement మైత్రీ సంస్థలో గోపీచంద్…

మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సరికొత్త కాంబినేషన్ కు రంగం సిద్దం చేసారు. మాస్ మహరాజా రవితేజ- నేషనల్ క్రష్ రష్మిక లను జోడీగా సెట్ చేసుకున్నారు. 

మైత్రీ సంస్థలో గోపీచంద్ మలినేని వరుసగా రెండో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు ఆరంభంలో శ్రీలీలను తీసుకుని థమాకా కాంబినేషన్ ను రిపీట్ చేస్తారు అనే వార్తలు వినిపించాయి. కానీ ఈ సరికొత్త కాంబినేషన్ ఇప్పుడు ఫైనల్ చేసారు.

ఇప్పటి వరకు రవితేజ-రష్మిక కలిసి నటించలేదు. కచ్చితంగా ఇది క్రేజీ కాంబినేషన్ అవుతుంది. పైగా రష్మిక వరుసగా మైత్రీ లో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆల్రెడీ పుష్ప 2 సెట్ మీద వుంది. ఇప్పుడు మళ్లీ మరో సినిమా. ఈ సినిమా దసరా కు ప్రారంభమై సెట్ మీదకు వెళ్తుంది. అప్పటి నుంచి ఇక నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.

ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు రెడీగా వుంది. అలాగే ఈగిల్ సినిమా పూర్తయింది. సంక్రాంతికి విడుదల చేస్తారు. ఈ రెండింటి తరువాత రవితేజ చేస్తున్న సినిమా ఇది.