Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎక్స్ క్లూజివ్...ఇంటికి చేరిన సాయి ధరమ్

ఎక్స్ క్లూజివ్...ఇంటికి చేరిన సాయి ధరమ్

మెగా ఫ్యాన్స్ కు దసరా హ్యాపీ న్యూస్. ప్రమాదానికి గురై గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలోనే వుంటూ చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఈ రోజు డిశ్చార్జి అవుతున్నారు. అపోలో వైద్యులు ఆయనను సురక్షితంగా ఇంటికి పంపిస్తున్నారు.

ప్రమాదంలో వచ్చిన షాక్ కారణంగా సాయి ధరమ్ తేజ్ కొంతకాలం పాటు సెమీ కోమాలో వుండిపోయారు. ఆ సమయంలోనే ఆయనకు చిన్న శస్త్ర చికిత్స, ట్రీట్ మెంట్ జరిగాయి. షాక్ నుంచి బయటకు వచ్చాక ఆయనకను ఫిజియో థెరపీ కూడా చేసారు. 

కొంతకాలం అపోలోలోనే వుంటే మంచిది అని మెగా ఫ్యామిలీ భావించడంతో అక్కడే వుంచారు. ఆ సమయంలోలో రిపబ్లిక్ సినిమా విడుదల కావడం, సాయితేజ్ కు, డైరక్టర్ దేవాకు ప్రశంసలు దక్కడం జరిగింది. 

ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ పూరిగా రికవరీ కావడంతో, దసరా నాడు ఇంటికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. విశేషం ఏమిటంటే ఈ రోజు ఆయన పుట్టిన రోజు కూడా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?