Advertisement

Advertisement


Home > Movies - Movie News

గీత సాక్షిగా..ఎమోషనల్ టీిజర్

గీత సాక్షిగా..ఎమోషనల్ టీిజర్

టాలీవుడ్ లోకి కొత్త తరం వస్తోంది. కొత్తగా ప్రయత్నాలు చేస్తోంది. ఆంథోని మట్టిపల్లి అనే యువదర్శకుడు, కొత్త, పాత తారాగణం కలయిలో అందిస్తున్న సినిమా గీత సాక్షిగా..చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర,తదితరులు నటిస్తున్నారు. 

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌, మోషన్ పోస్టర్స్ కు మంచి ఆదరణ లభించింది.

లేటెస్ట్ గా ఈ చిత్రం నుండి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.. క్రయిమ్..పోలీస్..కోర్టు..ల నేపథ్యంలో జరిగే యాక్షన్ డ్రామా అన్న క్లారిటీని టీజర్ ఇచ్చింది. టీజర్‌లో నటుడు ఆదర్శ్‌ను క్రిమినల్‌గా మరియు రాజా రవీంద్ర, లాయర్‌ శ్రీకాంత్ అయ్యంగార్‌, పాత్రలు కలసి నటుడు ఆదర్శ్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. పద్మ వ్యూహం లో చిక్కుకోవడానికి నేను అభిమన్యున్ని కాదు వాడి బాబు అర్జునున్ని రా అంటూ నటుడు ఆదర్స్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌ ను టీజర్ లో యాడ్ చేసారు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. వెంకట్ హ‌నుమ నరిసేటి సినిమాటోగ్ర‌ఫీగా, కిషోర్ మ‌ద్దాలి ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అక్కట్టుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?