జర్మనీలో మహేష్-త్రివిక్రమ్ డిస్కషన్లు

సర్కారు వారి పాట సినిమా విడుదల తరువాత ఫ్యామిలీతో జర్మనీలో వున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్వరలో త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా మొదలుపెట్టాల్సి వుంది.  Advertisement మహేష్ జర్మనీ నుంచి వచ్చే…

సర్కారు వారి పాట సినిమా విడుదల తరువాత ఫ్యామిలీతో జర్మనీలో వున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్వరలో త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా మొదలుపెట్టాల్సి వుంది. 

మహేష్ జర్మనీ నుంచి వచ్చే వరకు వెయిట్ చేస్తే కాలయాపన అవుతుంది. అందుకే త్రివిక్రమ్ నే జర్మనీ కి బయల్దేరి వెళ్లారు. అక్కడ ఆయన వారం రొజులు వుంటారు. మహేష్ కు ఫైనల్ నెరేషన్ ఇవ్వడం, అది అయిన తరువాత కీలకమైన రెండో హీరో గా ఎవర్ని తీసుకోవాలి అనే డిస్కషన్ వుంటాయి.

ఆపైన మిగిలిన స్టార్ కాస్ట్, షెడ్యూలు, ఇలా అన్నీ ఒకేసారి ఫైనల్ చేసుకుని త్రివిక్రమ్ వెనక్కు వస్తారు. త్రివిక్రమ్ తో పాటు సంగీత దర్శకుడు థమన్ కూడా వెళ్లారు. సినిమా థీమ్, ఏ తరహా పాటలు వుండాలి తదితర విషయాల్లో మహేష్ ఇన్ పుట్స్ కూడా తీసుకుంటారు.

త్రివిక్రమ్, థమన్ లతో పాటు నిర్మాత నాగవంశీ కూడా జర్మనీకి వెళ్లారు. వీలయినంత త్వరగా సినిమాను మొదలుపెట్టి, సంక్రాంతి బరిలోకి దింపాలని అనుకుంటున్నారు. అది వీలు కాకపోతే ప్రీ సమ్మర్ బరిలోకి దింపుతారు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ సర్కిళ్లలో మంచి బజ్ వుంది.