Advertisement

Advertisement


Home > Movies - Movie News

గుంటూరులో మైత్రీ మల్టీ ఫ్లెక్స్!

గుంటూరులో మైత్రీ మల్టీ ఫ్లెక్స్!

టాలీవుడ్ లో లీడ్ ప్రొడక్షన్ బ్రాండ్ గా వుంటున్న మైత్రీ మూవీస్ తన వ్యాపారాలు విస్తృతం చేస్తోంది. ఇప్పటికే నైజాంలో పంపిణీ వ్యవస్థ ప్రారంభించి, ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ను తట్టుకుని నిలదొక్కుకుంది. 

ఇప్పుడు ఎగ్జిబిషన్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతోంది. గుంటూరులో అయిదు స్క్రీన్ ల మల్టీ ఫ్లెక్స్ ను టేకోవర్ చేసే ప్రయత్నాలు చేస్తోంది.

గుంటూరులో ఫీనిక్స్ సంస్థ నిర్మించిన అయిదు స్క్రీన్ ల అద్భుతమైన మల్టీ ఫ్లెక్స్ అమ్మకానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీల్ ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో వుంది. మైత్రీ సంస్థ 30 నుంచి 35 కోట్ల రేంజ్ లో ఈ డీల్ ను క్లోజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇది పూర్తయితే ఎగ్జిబిషన్ రంగంలోకి కూడా మైత్రీ సంస్థ ఎంటర్ అయినట్లు అవుతుంది.

వన్స్ ఆ రంగంలో కూడా అడుగుపెడితే, మెల్లగా ముందుకు సాగడం ఎలాగూ వుంటుంది. ఎగ్జిబిషన్ రంగంపై పట్టుతోనే దిల్ రాజు ఇండస్ట్రీని కంట్రోల్ లో పెడుతూ వస్తున్నారు. వైజాగ్ లో ఆయనకు పోటీగా గాయత్రీ సతీష్ కూడా థియేటర్ల లీజు లోకి దిగారు. ఇలా ఒక్కొక్కరు ఎంటర్ కావడం అన్నది ఇండస్ట్రీ కి శుభ పరిణామమే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?