Advertisement

Advertisement


Home > Movies - Movie News

చోటాకు ఘాటుగా.. దర్శకుడి ఓపెన్ లెటర్

చోటాకు ఘాటుగా.. దర్శకుడి ఓపెన్ లెటర్

దర్శకుడు హరీశ్ శంకర్ మరో వివాదాన్ని రేపాడు. నిజానికి వివాదాన్ని అతడు రేపాడు అనే కంటే కొనసాగించాడు అనడం కరెక్ట్. ఎందుకంటే, ఈ వివాదానికి మూల కారణం చోటా కె.నాయుడు. కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన వ్యాఖ్యలకు హరీశ్ శంకర్ హర్ట్ అయ్యాడు. అందుకే చోటాకు ఘాటుగా ఓపెన్ లెటర్ రాశాడు. ఆ బహిరంగ లేఖలో సున్నితంగా చురకలంటిస్తూనే ఓపెన్ ఛాలెంజ్ చేశాడు.

"రామయ్యా వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో మీరు (చోటా కె నాయుడు) ఓ 10 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు. నేను వంద ఇచ్చి ఉంటాను. కానీ ఎక్కడా ఎప్పుడూ నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం నా గురించి పలుమార్లు అవమానకరంగా మాట్లాడారు."

ఈ సందర్భంగా ఓ ఘటనను కూడా గుర్తుచేశాడు హరీశ్ శంకర్. సినిమా షూటింగ్ టైమ్ లో ఓ సందర్భంలో ఛోటా కె నాయుడ్ని తీసేద్దాం అన్ ప్రతిపాదన వస్తే, హరీశ్ వద్దని చెప్పాడట. గబ్బర్ సింగ్ సక్సెస్ తర్వాత పొగరుతో హరీశ్, కెమెరామెన్ ను తీసేశాడని అంతా అనుకుంటారనే భయంతో చోటాను కాపాడాడంట.

"రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ అయినా ఏనాడు నీ (చోటా కె నాయుడు) మీద నింద మోపలేదు. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా నా ప్రస్తావన లేకపోయినా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు."  

ఇకనైనా చోటా కె నాయుడు తన గౌరవాన్ని కాపాడుకోవాలన్నాడు హరీశ్. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని, మరింత ముందుకు తీసుకెళ్లాలనకుంటే మాత్రం ఏ రోజైనా, ఏ వేదికపైనైనా, తేల్చుకోవడానికి తను సిద్ధమంటూ సవాల్ విసిరాడు. వీళ్లిద్దరి వివాదం సంగతి పక్కనపెడితే.. మాటిమాటికీ 'రామయ్య వస్తావయ్యా' సినిమా ఫ్లాప్ అంటుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?