హరీష్-పరుశురామ్-గౌతమ్

ముగ్గురు దర్శకులు..మూడు రకాల సినిమాలు చేయగలగిన సత్తా వున్నవారు. ఇప్పుడు ఈ ముగ్గురు ఒకే హీరో డేట్ ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ హీరో విజయ్ దేవరకొండ.  Advertisement దర్శకుడు హరీష్ శంకర్ కథ…

ముగ్గురు దర్శకులు..మూడు రకాల సినిమాలు చేయగలగిన సత్తా వున్నవారు. ఇప్పుడు ఈ ముగ్గురు ఒకే హీరో డేట్ ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ హీరో విజయ్ దేవరకొండ. 

దర్శకుడు హరీష్ శంకర్ కథ చెప్పారో..చెప్పే పనిలో వున్నారో మొత్తానికి దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంటున్నారు. విజయ్ ఊ అంటే ఫిబ్రవరి నుంచి సినిమా ఎక్కించడానికి రెడీగా వున్నారని బోగట్టా.

స‌ర్కార్ వారి పాట‌ తరువాత నాగ్ చైతన్యతో సినిమా చేయాల్సి వున్న పరుశురామ్ కూడా విజయ్ కు లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. విజయ్ ఊ అంటే ఈ సినిమా జిఎ2 బ్యానర్ మీద తెరకెక్కుతుంది. ఈ కాంబినేషన్ లో గీతగోవిందం లాంటి హిట్ వుంది.

ఇక ముచ్చటగా మూడో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఇటీవలే రామ్ చరణ్ క్యాంప్ నుంచి బయటకు వచ్చారు. మళ్లీ తనకు పేరు తెచ్చిన సితార బ్యానర్ లోకి వచ్చారు. విజయ్ కోసం కథ తయారు చేస్తున్నారు. అది విని ఓకె అంటే ఇక్కడ సినిమా వుంటుంది.

ఇలా మూడు బ్యానర్లు..ముగ్గురు డైరక్టర్లు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఖుషీ సినిమా షూటింగ్ సమంత కారణంగా ఆగడంతో, ఇమ్మీడియట్ గా సినిమా ఎక్కుతుందని ఈ ముగ్గురు ఆశపడుతున్నారు. పైగా ముగ్గురికి బ్యాకింగ్ గా మూడు పెద్ద బ్యానర్లు వున్నాయి.