నేను సేఫ్.. ప్రకటించిన శర్వానంద్

శర్వానంద్ కారుకు యాక్సిడెంట్ అయింది. ఇంతవరకు నిజం. కానీ అతడు తీవ్ర గాయాలపాలయ్యాడనేది మాత్రం అబద్ధం. దీనిపై ఈ హీరో స్పందించాడు. తను సేఫ్ గానే ఉన్నానని ప్రకటించాడు. Advertisement “ఈరోజు ఉదయం నా…

శర్వానంద్ కారుకు యాక్సిడెంట్ అయింది. ఇంతవరకు నిజం. కానీ అతడు తీవ్ర గాయాలపాలయ్యాడనేది మాత్రం అబద్ధం. దీనిపై ఈ హీరో స్పందించాడు. తను సేఫ్ గానే ఉన్నానని ప్రకటించాడు.

“ఈరోజు ఉదయం నా కారు యాక్సిడెంట్ కు గురైనట్టు వార్తలొచ్చాయి. అది చాలా చిన్న ఘటన. నేను పూర్తి ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్నాను. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ థ్యాంక్స్”

ఇలా తను పూర్తి ఫిట్ గా ఉన్న విషయాన్ని శర్వానంద్ ప్రకటించాడు. అందరి ప్రేమాభిమానాలతో తను సురక్షింతగా ఉన్నానని తెలిపాడు. హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి, కారు పల్టీ కొట్టింది. అయితే కారులో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉండడం వల్ల, శర్వానంద్ కు ఏం కాలేదు. కానీ ఓ సెక్షన్ మీడియా మాత్రం శర్వానంద్ కు సీరియస్ అంటూ వార్తలు వండేసింది. 

ఆ ఘటన నుంచి తను బయటపడినట్టు శర్వానంద్ ప్రకటించాడు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో, కారులో డ్రైవర్ సీటు పక్కన శర్వానంద్ కూర్చున్నట్టు తెలుస్తోంది.

మరో 5 రోజుల్లో పెళ్లికి సిద్ధమౌతున్నాడు శర్వానంద్. రాజస్థాన్ లో రక్షితారెడ్డిని పెళ్లాడబోతున్నాడు. వీళ్ల నిశ్చితార్థం ఇదివరకే పూర్తయింది. అంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే అదృష్టవశాత్తూ శర్వానంద్ కు ఏం కాలేదు.

రీసెంట్ గా ఒకే ఒక జీవితం అనే సినిమాతో హిట్ కొట్టాడు శర్వానంద్. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేసి, పెళ్లి కోసం చిన్న గ్యాప్ తీసుకున్నాడు శర్వానంద్.