Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇది సాహిత్యానికి కట్టిన ట్యూన్?

ఇది సాహిత్యానికి కట్టిన ట్యూన్?

ట్యూన్ కు పాట రాయడం అన్నది చాలా కాలంగా తెలుగు నాట కాదు, అసలు అన్ని భాషల సినిమా సంగీతంలో అలవాటైపోయిన వ్యవహారం. ఇది రచయితలకు సులువు అని కొందరు, కష్టం అని కొందరు అంటుంటారు. మ్యూజిక్ డైరక్టర్లు మాత్రం ఇలా చేయడం వల్ల మాంచి క్యాచీ ట్యూన్ లు ఇవ్వొచ్చు అనే అభిప్రాయం వుంది. 

విషయానికి వస్తే, సరిలేరు నీకెవ్వరు అంటూ వస్తున్న మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా నుంచి సెకెండ్ సింగిల్ బయటకు వదిలారు. మెలోడియస్ గిటార్ బిట్ తో పాట స్టార్ట్ అయింది. 'సూర్యుడివో..చంద్రుడివో..ఆ ఇద్దరి కలయికవో' అంటూ హీరో ఎలివేషన్ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రచించారు. బి ప్రాక్ పాడిన ఈ పాటలో రెండు మూడు రకాల ట్యూన్ లు వినిపించారు దేవీశ్రీ ప్రసాద్. 

పాట లో చరణం ఎత్తుగడ, నడక, మళ్లీ పైకి లేవడం అనే టెక్నిక్ లో మధ్యన నడక దగ్గరకు వచ్చేసరికి ట్యూన్ సొగసు లోపించింది. పాట మొత్తం కొత్త ఇనుస్ట్రుమెంటేషన్ వినిపించాడు. అది బాగుంది.

కానీ ఎప్పుడయితే..పాట మధ్యలో ''...గుండెలోతులో గాయం..నువ్వు తాకితే మాయం..మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సాయం''..అలాగే...''..దేవుడెక్కడో లేడు..వేరే కొత్తగా రాడు..మంచి మనుషులలో గొప్ప మనసు తానై వుంటాడు నీలా...''అన్న దగ్గర వింటే ఈ సమస్య తెలుస్తుంది.

దీనివల్ల దేవీ ట్యూన్ ఇవ్వకుండా, రఫ్ ట్యూన్ ఇచ్చి, రామజోగయ్య రాసిన తరువాత ట్యూన్ చేసారేమో అన్న అనుమానం కలుగుతోంది.

దీని వల్ల పాట మొత్తం కొత్త ఇనుస్ట్రుమెంటేషన్ వున్నా, మెలోడీ టచ్ ఇచ్చినా, ట్యూన్ దగ్గర క్యాచీనెస్ తగ్గినట్లు అనిపిస్తుంది. మరి జనాలకు ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి. పాట ఇనుస్ట్రుమెంటేషన్, సాహిత్యానికి తగినట్లు విడియోలో జోడించిన విజువల్స్ బాగానే వున్నాయి. అవి ఈ పాటవి కావచ్చు. లేదా సినిమాలోవి కావచ్చు. మొత్తం మీద ప్లెజెంట్ గా వున్నాయి.

<iframe width="100%" height="365" src="https://www.youtube.com/embed/OsA1kGilBzA" frameborder="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe>

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?