పుష్ప-2 పై ఐటీ దాడుల ప్రభావం?

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ పుష్ప-2 పై ఐటీ దాడుల ప్రభావం పడింది. 2 రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, నిర్మాతల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడుల కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.…

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ పుష్ప-2 పై ఐటీ దాడుల ప్రభావం పడింది. 2 రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, నిర్మాతల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడుల కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దర్శకుడు సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించడంతో సినిమా షూటింగ్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

తాజాగా పుష్ప-2 సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. హీరో అల్లు అర్జున్, మరికొంతమంది విదేశీ ఫైటర్లపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి కొన్ని స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. తాజా దాడులతో ఈ షెడ్యూల్ ను మధ్యలోనే నిలిపివేశారు.

తాజా సమాచారం ప్రకారం, మైత్రీ మూవీ మేకర్స్ కు సంబంధించి అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు, షూటింగ్ లు నిలిచిపోయాయి. మళ్లీ ఈ వ్యవస్థ మొత్తం గాడిన పడిన తర్వాతే షూటింగ్స్ మొదలవుతాయి. దీనికి ఇంకొన్ని రోజులు టైమ్ పట్టేలా ఉంది.

దాడుల ప్రభావం హీరోహీరోయిన్ల కాల్షీట్లపై కూడా పడింది. అల్లు అర్జున్ తో పాటు రష్మిక కాల్షీట్లు రద్దయినట్టు తెలుస్తోంది. అంతేకాదు, మరో 2 రోజుల్లో జరగాల్సిన వీరసింహారెడ్డి వంద రోజుల ఫంక్షన్ పై కూడా అనుమానాలు నెలకొన్నాయి.